Saturday, May 4, 2024

Big Breaking: గ్యాంగ్​ రేప్​ ఎట్లా జరిగిందంటే.. మీడియాకు వివరించిన సీపీ ఆనంద్​

హైదరాబాద్​లోని జూబ్లీహిల్స్​ పబ్​ వద్ద కారులో మైనర్​ బాలికను తీసుకెళ్లి గ్యాంగ్​ రేప్​ చేసిన కేసుకు సంబంధించిన వివరాలను హైదరాబాద్​ సిటీ సీపీ సీవీ ఆనంద్​ మీడియాకు వెల్లడించారు. ఆ కేసులో అసలేం జరిగిందనే వివరాలను తెలియజేశారు. ఈ కేసులో ఆరుగురు నిందితులున్నారని, వారందరిపై గ్యాంగ్​ రేప్​, ఫోక్సో వంటి చట్టాల కింద కేసు నమోదు చేశామన్నారు. కాగా, కేసులో నిందితులంతా మైనర్లే ఉన్నారు కాబట్టి వారి వివరాలు వెల్లడించడం కుదరదన్నారు. అయితే ఒకరు మేజర్​, మిగతా ఐదుగురు మైనర్లేనని తెలిపారు సీపీ ఆనంద్​.

కాగా, బెంగళూరులో నివసించే వ్యక్తి ఒకతను ఇక్కడ పార్టీకి ప్లాన్​ చేశాడని. ఉస్మాన్​ అలీఖాన్​ అనే వ్యక్తి ద్వారా పబ్​ బుక్​ అయ్యినట్టు చెప్పారు. 28వ తేదీ మధ్యాహ్నం ఒంటిగంటకి పబ్​కి బాధితురాలు వచ్చిందని, ఆరోజు ఘటన జరిగితే 31వరకు బయటకు చెప్పలేదని తెలిపారు. అయితే ఆ తర్వాత జరిగిన వరుస పరిణామాలు, నిందితుల గురించి వివరాలు సేకరించడం, సీసీ టీవీ ఫుటేజీ పరిశీలన తర్వాత ఈ కేసులో ఆరుగురు నిందితుల్ని అరెస్టు చేసినట్టు చెప్పారు. ఇందులో ఒకరి వయసు 18 సంత్సరాలకు ఒక నెల తక్కువగానే ఉందని తెలిపారు సీపీ ఆనంద్​. అయితే..  బాధితురాలు ఆ రోజు 1300 ఎంట్రీ ఫీజు కట్టి పబ్​కి వచ్చినట్టు తమ పరిశీలనలో వెల్లడైందన్నారు. నిందులందరికీ ఈ కేసులో 20 సంవత్సరాల జైలు, లైఫ్​ శిక్ష లేదా మరణశిక్ష కూడా పడొచ్చు.. అట్లాంటి కేసులు నమోదు చేసినట్టు తెలిపారు.

బాధితురాలు నిందితులను గుర్తించలేకపోతోందని, అనేక కోణాల్లో విచారణ జరపాల్సి ఉంది కాబట్టే కేసు ఆలస్యమైందన్నారు సీపీ సీవీ ఆనంద్​. తమ దగ్గర నిందితులకు సంబంధించిన బలమైన ఆధారాలున్నాయన్నారు. పబ్​ దగ్గర నుంచి కారులో ఎక్కించుకుని పెద్దమ్మ టెంపుల్​ వెనకాల ఆపి ఈ అఘాయిత్యానికి పాల్పడ్డట్టు తెలిపారు. అయితే.. ఆ మైనర్​పై అయిదుగురు రేప్​ చేసినట్టు తమ విచారణలో వెల్లడైందన్నారు. ప్రతి చిన్న విషయాన్ని డబుల్​ వెరిఫికేషన్​ చేయాల్సి వచ్చిందని, కేసును పకడ్బందీగా పెట్టడానికే సమయం పట్టిందన్నారు. ఆధారాలు లేకుండా కేసు బుక్​ చేయలమని చెప్పుకొచ్చారు సీపీ ఆనంద్​.

- Advertisement -

ఇదీ జరిగింది.. బాలికను చూసి ప్లాన్​ చేసుకున్నారు..

మధ్యాహ్నం 1గంటకే పబ్​కి వచ్చిన బాలిక.. ఆ రోజు 3 గంటల తర్వాత ఆరుగురు ఫ్రెండ్స్​ ఆ పబ్​కి చేరుకున్నారు. ఆ అమ్మాయిని చూసి వాళ్లు ప్లాన్​ చేసుకున్నారు. 3.15కి బాలికతో అసభ్యంగా మాట్లాడారు. బాధితురాలికి అక్కడే తారసపడిన స్నేహితురాలు. అప్పటి నుంచి 5.40 దాకా ఆ అమ్మాయిని వేధించారు. ఆ తర్వాత పబ్​ నుంచి ఆమె ఫ్రెండ్​ బయటకు వెళ్లిపోయింది. ఆ తర్వాత ఇన్నోవా కారులో ఆ బాలికను తీసుకెళ్లారు. కారులోనే నలుగురు బలవంతంగా ముద్దుపెట్టుకున్నారు. బాధితురాలితో సహా కారులో మొత్తం ఆరుగున్నారు. ఆ తర్వాత బెంజ్​ కారులో నుంచి ఇన్నావాలోకి మారిన బాలిక. రోడ్కే​ నెంబర్సు​ 44లో చీకటి ప్రాంతంలో గ్యాంగ్​ రేప్​ చేశారు. బాలిక ఫోన్ కాల్​తో 7.53కి ఆమె తండ్రి వచ్చి తీసుకెళ్లాడు. 1గా సాదుద్దీన్​ మాలిక్​,

Advertisement

తాజా వార్తలు

Advertisement