Saturday, May 4, 2024

Breaking: ఢిల్లీలో మళ్లీ కంపించిన భూమి.. భయంతో రోడ్లమీదికి పరుగులు తీసిన జనం

దేశ రాజధాని ఢిల్లీలో మరోసారి భూమి కంపించింది. దీంతో చాలామంది జనం రోడ్ల పైకి పరుగులు తీశారు. ఒక్క క్షణం తమ కుటుంబ సభ్యులలో ఎవరు ఏమైపోతారో అన్న భయం వారిని ఆందోళన పడేలా చేసింది. ఉన్నట్టుండి ఒక్కసారిగా భూమి కంపించడంతో ప్రజలు ఏమైందో అని టెన్షన్ పడ్డారు. రిక్టర్​ స్కేలుపై 5.4 గా రికార్డు అయినట్టు అధికారులు తెలిపారు. అయితే.. భయంతో కొందరు బయటకు పరుగులు తీయడంతో, భూమిపై ఏర్పడిన పగుళ్లు చూసి షాక్ అయ్యారు. పెద్ద నష్టం జరగలేదని… తృటిలో తప్పించుకున్నామని ఊపిరి పీల్చుకున్నారు.

ఈ మధ్యకాలంలో ఢిల్లీలో ఎక్కువగా భూకంపాలు చోటుచేసుకుంటున్నాయి. దాంతో ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియక ప్రజలు టెన్షన్ పడుతున్నారు. కాగా ఇవ్వాల (శనివారం) రాత్రి మరోసారి భూ ప్రకంపనలు టెన్షన్ పెట్టాయి. శుక్రవారం తెల్లవారుజామున 5 గంటల సమయంలో ఢిల్లీలోని నంగలోయి ప్రాంతంతోపాటు ఎన్సీఆర్, నోయిడా, ఘజియాబాద్ ప్రాంతాల్లో కూడా భూమి స్వల్పంగా కంపించింది. ఈ ప్రాంతాలలో సంభవించిన భూప్రకంపనలు ఒక్కసారిగా ప్రజల్ని భయబ్రాంతులకు గురి చేశాయి.

అయితే.. ఇక్కడ సంతోషించాల్సిన విషయం ఏమిటంటే… భూకంపం స్వల్పంగానే ఉండడంతో ఎటువంటి ప్రాణ నష్టం కానీ ఆస్తి నష్టం కానీ జరగలేదు. ఈ భూకంపం ప్రభావం రిక్టర్ స్కేలుపై 2.3 గా నమోదైందని ఇది చాలా స్వల్పమైన భూకంపం అని జాతీయ సీస్మాలజీ కేంద్ర అధికారులు పేర్కొన్నారు. మళ్లీ ఇటువంటి భూ ప్రకంపనాలు వచ్చే అవకాశాలు ఉన్నా ఏమోనని ప్రజలు భయ పడుతుండగా… పెద్దగా ప్రమాదం లేదని, చింతించాల్సిన అవసరం లేదని ధైర్యం చెప్పారు అధికారులు. కాగా ప్రస్తుతం ఢిల్లీలోని వాతావరణం ప్రశాంతంగానే ఉంది. అయితే.. వరుసగా భూ ప్రకంపనలు రావడం, నాలుగు రోజుల వ్యవధిలో వరుస ప్రకంపనలతో ఢిల్లీ జనం భయపడుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement