Tuesday, April 23, 2024

అమ్మా, నన్ను మన్నించు.. అంత్యక్రియలకు హాజరు కాలేకపోయా: మల్లోజుల వేణుగోపాల్

అమ్మా నన్ను మన్నించు.. కని పెంచిన నీ రుణం తీర్చుకోలేకపోయా.. అయితే నీవు తుది శ్వాస విడిచే వరకు నేను సజీవంగా ఉండాలనే నీ కోరిక మాత్రం తీర్చగలిగా.. అంటూ మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు మల్లోజుల వేణుగోపాలరావు తన తల్లి మల్లోజుల మధురవ్వకు నివాళులర్పిస్తూ లేఖ విడుదల చేశారు.

‘‘నీ అంత్యక్రియలకు నేను కాలేకపోయినా పౌరహక్కుల సంఘం నాయకులు హాజరై పార్థివ దేహంపై ఎర్రబట్ట కప్పడం చూసి ఆనందించా.. అంత్యక్రియల సమయంలో వారు పాడిన విప్లవ గీతాలు ఇప్పటికీ నా చెవుల్లో ద్వనిస్తునే ఉన్నాయి. నమ్మిన సిద్ధాంతం కోసం తుది శ్వాస విడిచే వరకు ఉద్యమంలోనే కొనసాగుతా” అని హామీ ఇస్తున్నా అంటూ తన లేఖలో మల్లోజుల వేణుగోపాల్​ పేర్కొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement