Monday, May 13, 2024

1900 అడుగుల ఎత్తులో ఉండగా ..విమానాన్ని ఢీకొన్న పక్షి

బడ్జెట్ ఎయిర్ లైన్ ఆకాశకు చెందిన బోయింగ్ 737 మ్యాక్స్‌ 8 ఎయిర్‌క్రాఫ్ట్‌ అహ్మదాబాద్‌ నుంచి ఢిల్లీకి వెళుతుండగా గురువారం పక్షి ఢీకొంది. 1900 అడుగుల ఎత్తులో ఉండగా విమానాన్ని పక్షి ఢీకొనడంతో ఫ్లైట్‌ రాడోమ్‌ దెబ్బతిన్నట్టు గుర్తించారు. ఢిల్లీలో ల్యాండయిన అనంతరం రాడోమ్‌ డ్యామేజ్‌ను అధికారులు కనుగొన్నారు. ఆకాశ ఎయిర్‌లైన్‌ తొలి వాణిజ్య విమాన సేవలు ఈ ఏడాది ఆగస్ట్‌లో ప్రారంభమయ్యాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement