మహబూబాబాద్ జిల్లాలో ఘోరం జరిగింది. మహబూబాబాద్ శివారులోని ఆర్తి గార్డెన్ సమీపంలో లోడుతో ఆగి ఉన్న ట్రాక్టర్ ను బైక్ ఢీకొట్టడంతో ఇద్దరు చనిపోయారు. లారీని వెనుకవైపు నుంచి వచ్చిన బైక్ బలంగా ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది. చనిపోయిన వారు గాంధీపురం గ్రామానికి చెందిన శివ, సాయిగా గుర్తించారు. మృతదేహాల వద్ద వారి మాతృమూర్తి గుండెలు పగిలేలా విలపించడం అందరినీ కలిచివేసింది. ఈ ప్రమాదానికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
- Advertisement -