Thursday, May 2, 2024

ముంబ‌యి ఎయిర్ పోర్ట్ ని పేల్చేస్తాం.. ఉగ్ర‌వాద బెదిరింపు కాల్

ముంబ‌యి ఛ‌త్ర‌ప‌తి శివాజీ మ‌హారాజ్ అంత‌ర్జాతీయ విమానాశ్ర‌యానికి ఉగ్ర‌వాద బెదిరింపు కాల్ వ‌చ్చింది. ఎయిర్ పోర్ట్ ని పేల్చేస్తామ‌ని బెదిరించార‌ట‌. దాంతో రాష్ట్ర పోలీసులు, ఇతర ఏజెన్సీలు అప్రమత్తమయ్యాయి. పోలీసులు వెల్ల‌డించిన వివ‌రాల ప్రకారం.. కాల్ చేసిన వ్యక్తి తనను ఇర్ఫాన్ అహ్మద్ షేక్ అనీ, ఉగ్రవాద సంస్థ-ఇండియన్ ముజాహిదీన్ సభ్యుడిగా పరిచయం చేసుకున్నాడు. పోలీసుల‌కి కాల్ వచ్చిన వెంటనే విమానాశ్రయం వద్ద భద్రతను పెంచారు. ప్రతి అనుమానాస్పద కదలికలపై నిశితంగా పరిశీలించడానికి ఏజెన్సీలను అప్రమత్తం చేశారు. ఆ ప్రాంతంలో త‌నిఖీలు సైతం నిర్వ‌హిస్తున్నారు. కేసు నమోదు చేసుకుని తదుపరి దర్యాప్తు జరుపుతున్నట్లు పోలీసులు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement