Thursday, April 25, 2024

నంద్యాల ప్రజల నీటి కష్టాలు తీర్చండి.. మాజీ ఎమ్మెల్యే భూమా

రాబోయే వేసవి కాలంలో నంద్యాల ప్రజలకు నీటి సమస్య లేకుండా చూడాలని, అమృత్ పథ‌కం పూర్తి చేసి నంద్యాల ప్రజల నీటి కష్టాలు తీర్చాలని నంద్యాల మాజీ ఎమ్మెల్యే భూమా బ్రహ్మానందరెడ్డి అధికారులను కోరారు..ఈ మేరకు ఆయన మంగళవారం నంద్యాల మునిసిపల్ కమిషనర్ రవిచంద్రారెడ్డిని కలిసి నీటి సమస్య పై చర్చించారు. అనంతరం ఆయన మాట్లాడతూ… 80శాతం పూర్తయిన అమృత పథకం పూర్తి చేసి ఇంటింటికి మెరుగైన నీటి సరఫరా చేయాలని కోరామన్నారు.. అలాగే ఫిబ్రవరి నెలలో నీటి సమస్య తీరుస్తానని గతంలో కమీషనర్ హామీ ఇచ్చిన మేరకు పనులు పూర్తి చెయ్యాలని కోరామన్నారు.

విద్యుత్ సమస్యలు, పైప్ లైన్ సమస్యలు సాకుగా చూపించి ప్రజలను ఇబ్బంది పెట్టవద్దని ఈ సందర్భంగా భూమా కమిషనర్ ను కోరారు. త్వరలోనే అన్ని సమస్యలు అధిగమించి ప్రజలకు నీటి కష్టాలు లేకుండా చూస్తామని కమిషనర్ హామీ ఇచ్చినట్లు భూమా తెలిపారు. భూమా వెంట మున్సిపల్ ఫ్లోర్ లీడర్ మాబువలి, న్యాయవాది మనోహర్ రెడ్డి, జయ ప్రకాష్, సుబ్బరాయుడు, తిమ్మయ్య, వెంకటేశ్వర్లు, తెలుగుదేశం నేతలు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement