Saturday, May 18, 2024

Breaking: కర్ణాటకలో ఘోర ప్రమాదం .. ఏడుగురు దుర్మ‌ర‌ణం

క‌ర్ణాట‌క‌ రాష్ట్రంలో ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. రాష్ట్రంలోని క‌ల‌బురిగి జిల్లా క‌మ‌లాపుర‌లో వేగంగా వ‌చ్చిన ఓ ప్ర‌యివేటు బ‌స్సు.. జీపును ఢీకొట్టింది. దీంతో ఒక్క‌సారిగా బ‌స్సులో మంట‌లు చెల‌రేగాయి. ఈ ప్ర‌మాదంలో ఏడుగురు ప్ర‌యాణికులు మృతి చెందారు. మ‌రికొంద‌రు తీవ్రంగా గాయ‌ప‌డ్డారు. స‌మాచారం అందుకున్న పోలీసులు ఘ‌ట‌నాస్థ‌లికి చేరుకుని స‌హాయ‌క చ‌ర్య‌లు చేప‌ట్టారు. మృత‌దేహాల‌ను స్వాధీనం చేసుకుని, క్ష‌త‌గాత్రుల‌ను చికిత్స నిమిత్తం స‌మీప ఆస్ప‌త్రికి త‌ర‌లించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement