Monday, April 29, 2024

Hyd | రేప‌టి నుంచి పది పరీక్షలు.. హైద‌రాబాద్‌లో ప‌క్కా ఏర్పాట్లు

హైద‌రాబాద్ జిల్లాలో పదో తరగతి పరీక్షలు సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ పరీక్షలు ఏప్రిల్‌ 3 నుంచి 13 వరకు నిర్వహిస్తారు. ఇందులో భాగంగా పరీక్షలు జరిగే రోజుల్లో ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నాం 12.30 గంటల వరకు ఉంటాయి. ఈ పరీక్షలకు జిల్లా వ్యాప్తంగా72 వేల 114 మంది విద్యార్థులు హాజరవుతున్నట్లు డీఈవో రోహిణి ప్రభన్యూస్‌తో చెప్పారు. పరీక్ష కేంద్రాలకు విద్యార్థులు ముందుగానే చేరుకునేందుకు తగిన చర్యలు తీసుకోవాలని కోరారు.

– ప్రభన్యూస్‌, హైదరాబాద్

హైదరాబాద్‌ జిల్లాలో పది పరీక్షల నిర్వహణక అధికారులు పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. హెదరాబాద్‌ జిల్లా వ్యాప్తంగా ఆయా ప్రభుత్వ, ప్రైవేట్‌ విద్యా సంస్థల నుంచి ఈ పరీక్షలకు దాదాపు 72 వేల 114 మంది హాజరుకానున్నట్లు సమాచారం. ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నా ం 12.30 గంటల వరకు నిర్వహించనున్నారు. హైదరాబాద్‌ జిల్లా వ్యాప్తంగా 344 పరీక్ష కేంద్రాల్లో విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. ప్రతి పరీక్షా కేంద్రంలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు.

పరీక్షల పర్యవేక్షణకు సంబంధించి మొత్తం 17 ఫ్లైయింగ్‌ స్కాడ్స్‌ ను..ప్రతి పరీక్షా కేంద్రంలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. అదే విధంగా పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్‌ అమలుతో పాటు, సమీపంలోని జీరాక్స్‌ సెంటర్లను మూసివేయాలని ఇప్పటికే ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే.

- Advertisement -

గంటముందుగానే చేరుకోవాలి..
పదో తరగతి పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు గంట ముందుగానే కేంద్రానికి చేరుకోవాలని హైదరాబాద్‌ జిల్లా డీఈవో ఆర్‌.రోహిణి సూచించారు. పది పరీక్షల నిర్వహణ, ఏర్పాట్లకు సంబంధించి పలు విషయాలపై ఆదివారం ప్రభన్యూస్‌తో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ..పరీక్ష కేంద్రానికి గంట ముందుగా రావడం వల్ల విద్యార్థులు టెన్షన్‌కు గురికాకుండా ఉంటారన్నారు. స్మార్ట్‌ ఫోన్లు, వాచ్‌లు ఇతర పరికరాలు(గ్యాడ్జెట్స్‌) అనుమతించబోమని స్పష్టం చేశారు. పరీక్షలు జరిగే రోజుల్లో ప్రతిరోజు ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నాం 12.30 గంటల వరకు జరుగుతాయని తెలిపారు.

అయితే పరీక్ష కేంద్రాలకు 5 నిమిషాల వెసులుబాటుతో 9 గంటల 35 నిమిషాల వరకు మాత్రమే అనుమతి ఉంటుందని, ఆ తర్వాత ఎట్టి పరిస్థితుల్లో ఎవరిని ఎంట్రీ చేయరని తెలిపారు. అందువల్ల విద్యార్థుల సమయానికి పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలని కోరారు. అంతేకాకుండా ఎగ్జామినేషన్స్‌ సెంటర్లోకి వెళ్లిన వెంటనే విద్యార్థులు తమ హాల్‌టిక్కెట్లను చెక్‌ చేసుకోవాలన్నారు. ఎలాంటి సమస్యలున్నా వెంటనే ఎగ్జామినర్‌ కు తెలిపితే తగిన పరిష్కార చర్యలు చేపడతారని వివరించారు. అంతేకాకుండా ఇతరత్రా ఏ సమస్యలున్నా..డిప్యూటీ ఈవోలను మొబైల్‌ నంబర్లలో సంప్రదించాలని కూడా ఆమె సూచించారు.

డిప్యూటీ ఈవోల నెంబర్లు..

జోన్‌ | ప్రాంతీయ ఉప విద్యాధికారి | మొబైల్‌ నంబరు

  • అమీర్‌పేట యాదయ్య 9948441336
  • బహదూర్‌ పుర సయ్యద్‌ ఖాజా ముఖరం 9985189218
  • బండ్లగూడ సయ్యద్‌ ఖాజా ముఖరం 9985189218
  • చార్మినార్‌ నెహ్రూబాబు 9502285821
  • గోల్కొండ బి.వెంకటేశ్వర్లు 9032134582
  • హిమాయత్‌ నగర్‌ ఎం.విజయలక్ష్మి 9989689718
  • ఖైరతాబాద్‌ ఎం.సామ్యూల్‌రాజు 8121267750
  • మారెడ్‌పల్లి బాలు నాయక్‌ 9492183171
  • ముషీరాబాద్‌ ఎస్‌.చిరంజీవి 7207338520
  • నాంపల్లి బి.వెంకటేశ్వర్లు 9032134582
  • సైదాబాద్‌ రాధా కిషన్‌ 93464-53463
  • సిికింద్రాబాద్‌ కేవీ రమణమూర్తి 9959150878
Advertisement

తాజా వార్తలు

Advertisement