Thursday, May 2, 2024

మేడారం జాత‌ర‌పై టెలీకాన్ఫ‌రెన్స్ – కీల‌క ఆదేశాలు జారీ చేసిన సీఎస్. సోమేశ్ కుమార్

దేశంలోనే అతిపెద్ద గిరిజ‌న జాత‌ర మేడారం జాత‌ర‌. ఈ జాత‌ర ఫిబ్ర‌వ‌రి 16 నుండి 19వ‌ర‌కు జ‌రుగుతుంద‌ని తెలంగాణ స‌ర్కార్ తెలిపింది. కాగా ఈసారి కోటి మందికి పైగా భ‌క్తులు హాజ‌ర‌వుతార‌ని అధికారులు అంచ‌నా వేస్తున్నారు. కాగా ఈ జాత‌ర‌కి హాజరయ్యే వారికి ఏవిధమైన ఇబ్బందులు రావొద్దని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించినందున అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలన్నారు. నేడు జంపన్న వాగులోకి నీరు విడుదల చేసామని.. దేవాదాయ, ఇంజనీరింగ్ విభాగాల పనులన్నీ దాదాపుగా పూర్తి కావొచ్చాయని చెప్పారు. అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి భక్తులకు ఏవిధమైన ఇబ్బందులు రాకుండా చర్యలు చేపట్టాలని వెల్లడించారు. మేడారం పూజారులు, ట్రస్టు బోర్డు సభ్యులతో కలసి పనిచేయాలని.. జాతరకు వచ్చే భక్తులు సంతృప్తికరంగా దర్శనం చేసుకొని క్షేమంగా వెళ్లేవిధంగా చర్యలు చేపట్టాలన్నారు.

ఆర్టీసీ ద్వారా 3850 బస్సులు నడిపి 21 లక్షల మంది ప్రయాణికులను చేరవేసేందుకు చర్యలు తీసుకోవాలని.. మేడారంలో ప్రధాన ఆసుపత్రి ఏర్పాటుతోపాటు మరో 35 హెల్త్ క్యాంపుల ఏర్పాటు చేసినట్లు చెప్పారు. పంచాయితీ రాజ్ శాఖ నుండి 5000 వేల మంది సిబ్బంది ఏర్పాటు చేసినట్లు వివరించారు. మేడారం జాతర ఏర్పాట్లపై ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు సంబంధిత శాఖల ఉన్నతాధికారులతో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ , డీజీపీ మహేందర్ రెడ్డి ల టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా.. సి.ఎస్. సోమేశ్ కుమార్ కీలక ఆదేశాలు జారీ చేశారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement