Tuesday, May 7, 2024

టీఆర్ఎస్ లో చేరికపై ఎల్.రమణ క్లారిటీ

తాను పార్టీ మారుతున్నట్లు జరుగుతున్న ప్రచారంపై టీడీపీ తెలంగాణ అధ్యక్షుడు ఎల్. రమణ స్పందించారు. తాను ఎప్పుడూ పదవి కోసం ఆశించలేదన్నారు. ప్రజల్లో ఉంటూ ప్రజల కోసం పాటుపడుతున్నామన్నారు. ఇప్పుడు ఉన్న పరిస్థితిలలో ఓటరు మమ్మల్ని నమ్మి ఓటు వేసిన వారికి మా వంతు కృషి చేస్తున్నామని తెలిపారు. రాష్ట్ర రాజకీయాల్లో పరిస్థితులు మారాయన్నారు రమణ. అందుకే తాజా పరిస్థితుల్ని బట్టి ముందుకు వెళ్లాలని నిర్ణయించుకున్నానని చెప్పారు.

టీఆర్ఎస్ పార్టీ వారితో తాను ఎలాంటి చర్చలు జరపలేదన్నారు. ఎప్పుడు తెలుగుదేశం పార్టీని నమ్ముకొని ముందుకు సాగానన్నారు. ఈ పార్టీలో ఉంటూనే ప్రజలకు తన వంతు సహాయం చేశానని తెలిపారు. తాను టిఆర్ఎస్ పార్టీ వాళ్లతో మాట్లాడినట్లు సోషల్ మీడియాలో వస్తున్న ప్రచారాలు పూర్తి అవాస్తవమన్నారు. ఏమైనా ఉంటే మీడియా ద్వారా సమాచారం అందిస్తామని ఎల్ రమణ పేర్కొన్నారు. గత 27 సంవత్సరాలుగా టీడీపీలో కొనసాగుతున్నానని, స్వర్గీయ ఎన్టీఆర్, చoద్రబాబు ఆదేశాలకు అనుగుణంగా నడుచుకుంటున్నానని చెప్పారు. తెలుగుదేశం పార్టీ రాజకీయా విశ్వావిద్యాలయం అని తాను ఓ నిత్య విద్యార్థి అని చెప్పారు. కార్యకర్తలు, అభిమానుల నిర్ణయాన్ని గౌరవిస్తానని చెప్పారు. హుజరాబాద్ బిసి అభ్యర్తిగా తనతో ప్రయోగం చేస్తారని భావించలేదన్నారు. సోషల్ మీడియాలో వస్తున్న ప్రచారాలు పూర్తి అవాస్తవం ఏమైనా ఉంటే మీడియా ద్వారా సమాచారం అందిస్తానని రమణ స్పష్టం చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement