Saturday, April 20, 2024

సంతోష్ శోభన్ @మంచి రోజులు వచ్చాయి….!!

డైరెక్టర్ మారుతి ప్రస్తుతం గోపీచంద్ హీరోగా పక్కా కమర్షియల్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో రాశిఖన్నా హీరోయిన్ గా నటిస్తుంది. మారుతి ఇందులో ఇటీవల ఏక్ మినీ కథ సినిమాతో హిట్ ను అందుకున్న సంతోష్ శోభన్ తో ఓ సినిమా చేయబోతున్నాడు. కాగా ఈ సినిమాను నెల రోజుల్లో పూర్తి చేయాలనే టార్గెట్ పెట్టుకున్నాడట మారుతి. ఇక ఇందులో హీరోయిన్ గా మెహరిన్ నటిస్తున్నారు.

తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాకు మంచి రోజులు వచ్చాయి అని ఇంట్రెస్టింగ్ టైటిల్ ని అనుకుంటున్నట్లు తెలుస్తోంది. కాగా ఈ సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ స్టార్ కాస్ట్ పనులను లాక్ డౌన్ లోనే కంప్లీట్ చేశారట దర్శకుడు. ఇక ఈ సినిమాను గీతా ఆర్ట్స్ బ్యానర్ లో అల్లు అరవింద్ ఈ సినిమాను నిర్మించనున్నాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement