తెలంగాణ పోలీసులు మరో గౌరవప్రదమైన అవార్డుని అందుకోనున్నారు. పాస్పోర్ట్ వెరిఫికేషన్ టైమ్లైన్ని కచ్చితంగా పాటించి, సత్వర పాస్పోర్ట్ జారీకి కృషిచేసినందుకు కేంద్ర ప్రభుత్వం తెలంగాణను ఎంచుకుంది. ఈ మేరకు ఈ విషయాన్ని తెలంగాణ డీజీపీ ఎం. మహేందర్రెడ్డి వెల్లడించారు. తెలంగాణ పోలీస్ డిపార్ట్ మెంట్ అత్యుత్తమమైనదిగా విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ (MEA) గుర్తించిందని, అందుకు ప్రత్యేక అవార్డు అందజేయనుందని సంతోషంగా చెప్పారు.
2021-22 సంవత్సరానికి పాస్పోర్ట్ వెరిఫికేషన్ టైమ్లైన్లను నిర్వహించడంలో తెలంగాణ రాష్ట్ర పోలీసు దేశంలోనే అత్యుత్తమంగా ఉందని రాష్ట్ర డీజీపీ ఎం. మహేందర్ రెడ్డి అన్నారు. ఈ నెల 18-19 తేదీల్లో ఢిల్లీలో జరిగే ప్రాంతీయ పాస్పోర్ట్ అధికారుల సదస్సు 2022లో విదేశీ వ్యవహారాల మంత్రి ఎస్ జైశంకర్ ఈ అవార్డును అందజేయనున్నారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని రాష్ట్ర పోలీసు సిబ్బందిని డీజీపీ ప్రశంసించారు. రాష్ట్రానికి మరెన్నో మహోన్నతమైన గౌరవ అవార్డులు వస్తాయని ఆశిస్తున్నామని ఆయన అన్నారు.