Monday, April 29, 2024

Omicron cases: కరోనా థర్డ్ వేవ్ ముప్పు.. ఒమిక్రాన్ పై తస్మాత్ జాగ్రత్త!

దేశంలో కరోనా థర్డ్ వేవ్ వచ్చే ప్రమాదం ఉందని తెలంగాణ రాష్ట్ర ప్రజారోగ్య సంచాలకులు శ్రీనివాస్ తెలిపారు. ఒమిక్రాన్ ఏ క్షణంలోనైనా భారత్​లోకి రావొచ్చని ఆయన అన్నారు. బుధవారం(డిసెంబర్ 1) యూకే, సింగపూర్ నుంచి వచ్చిన 325 ప్రయాణికుల్లో ఒకరికి కోవిడ్  పాజిటివ్ వచ్చిందని తెలిపారు. అయితే, బాధితుడికి టిమ్స్​లో చేర్పించామని, ఆ వ్యక్తి టెస్ట్ రిపోర్టు ఇంకా రావాల్సి ఉందన్నారు. ఒమిక్రాన్ కొత్త వేరియంట్​ కట్టడిపై సీఎం కేసీఆర్ అధ్యక్షతన సుదీర్ఘంగా చర్చించినట్లు చెప్పారు. ఒమిక్రాన్ వేరియంట్​ బారిన పడకుండా ఉండాలంటే.. జాగ్రత్తగా ఉండటం ఒక్కటే మార్గమని చెప్పారు. మాస్కు ధరించి, భౌతికదూరం పాటించాలని సూచించారు. మాస్కు ధరించని వారికి రూ.1000 జరిమానా విధిస్తామని హెచ్చరించారు.

ప్రజలు కొవిడ్ నిబంధనలు తప్పక పాటించాలన్న డీహెచ్.. అందరు కరోనా టీకా రెండు డోసులు వేసుకోవాలని సూచించారు. రాష్ట్రంలో 25 లక్షల టీకా డోసులు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. ఇక నుంచి వ్యాక్సినేషన్ తప్పనిసరి చేసే ప్రతిపాదనలు చేస్తున్నట్లు చెప్పారు. ప్రజలు జాగ్రత్తలు పాటించకపోతే ఒమిక్రాన్ ముప్పు ఎక్కువ అవుతుందన్నారు. విద్యాసంస్థల్లో పలువురి విద్యార్థులకు కరోనా పాజిటివ్ వస్తోందన్న డీహెచ్ శ్రీనివాస్.. వైరస్ ఇంకా పూర్తిగా నిర్మూలన కాలేదని చెప్పారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ఆంధ్రప్రభ న్యూస్ కోసం  ఫేస్‌బుక్‌ట్విట్టర్  పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement