Friday, May 3, 2024

తెలంగాణ లైఫ్ సైన్సెస్ – హైద‌రాబాద్ కు ప్ర‌పంచ గుర్తింపు

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ బ్యూరో: ఐటీ రంగం అభివృద్ధికి అనుకూలమైన ప్రాంతాల్లో దేశంలోనే తెలంగాణ అగ్రస్థానంలో నిలిచిందని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీ రామారావు తెలిపారు. ఈ విషయం తాము తేల్చింది కాదనీ, ఇటీవల దావోస్‌ వేదికగా జరిగిన ప్రపంచ ఆర్థికవేత్తల సదస్సులో పలువరు ప్రముఖులు ప్రకటించారని గుర్తుచేశారు. 2028 నాటికి రాష్ట్రంలో లైఫ్‌ సైన్సెస్‌ ఈకో సిస్టం విలువను రెట్టింపు చేస్తామన్న లక్ష్యాన్ని దృష్టిలో పెట్టుకుని ముందడుగు వేస్తున్నామన్నారు. ఈ నెల 24 నుంచి రెండు రోజులపాటు హైదరాబాద్‌ వేదికగా జరుగనున్న ప్రతిష్టాత్మక బయో ఆసియా సదస్సు నేపథ్యంలో మంత్రి కేటీఆర్‌ విలేకరులతో ‘చిట్‌చాట్‌’ నిర్వహించారు. ఈ సందర్భంగా కేటీఆర్‌ మాట్లాడుతూ, ప్రస్తుతం 50 బిలియన్‌ డాలర్ల విలువ కలిగిన లైఫ్‌ సైన్సెస్‌ ఈకో సిస్టంను 2028 నాటికి రెట్టింపు చేస్తామన్నారు. 4 లక్షల ప్రస్తుత ఉద్యోగాల సంఖ్యను రెట్టింపు చేసి 8 లక్షల ఉద్యోగ అవకాశాలను కల్పిస్తామన్నారు. బయో ఆసియా ప్రాముఖ్యతతోపాటు- జీవశాస్త్ర, ఫార్మా రంగాల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన, చేపట్టనున్న చర్యలు పురోగతి దిశగా ఉన్నాయన్నారు. ఇప్పటి వరకు 19 సదస్సులను పూర్తిచేసుకుని, ఈసారి ప్రతిష్టాత్మకమైన 20వ బయో ఆసియా సదస్సును తెలంగాణాలో నిర్వహించుకోబోతున్నామని కేటీఆర్‌ వెల్లడించారు. ఈనెల 24 నుంచి 26 వరకు ఈ సదస్సు జరుగుతుందని తెలిపారు.

బయో ఆసియా గత 19 ఏళ్లలో మూడు బిలియన్‌ డాలర్లు సుమారు రూ.24 వేల కోట్ల పెట్టుబడులను రాష్ట్రానికి తీసుకువచ్చిందని ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్‌ పేర్కొన్నారు. ”షషేపిగ్‌ నెక్ట్స్‌ జనరేషన్‌ హ్యూమనైజ్డ్‌ హెల్త్‌కేర్‌” అన్న ఇతివృత్తంతో జరగనున్న 20వ బయో ఆసియా సదస్సు జరగనుందన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌గా ఉన్నప్పుడు వచ్చిన పెట్టుబడుల్లో కొన్ని ఆంధ్రప్రదేశ్‌కూ వెళ్లాయన్నారు. భారతదేశ లైఫ్‌ సైన్సెస్‌ రంగానికి బయో ఏసియా విస్తృతమైన సేవలను అందించిందని చెప్పారు. దేశ లైఫ్‌ సైన్సెస్‌ రంగంలోని అవకాశాలను ప్రపంచానికి పరిచయం చేయడంలో ఈ సదస్సు విజయం సాధించిందన్నారు.

వందకు పైగా దేశాల నుంచి శాస్త్రవేత్తల ఆతిథ్యం
వందకుపైగా దేశాలకు చెందిన శాస్త్రవేత్తలు, నోబెల్‌ అవార్డు గ్రహీతలకు ఆతిథ్యం ఇవ్వగలిగామని, 20 వేలకుపైగా భాగస్వామ్య చర్చలు జరిగాయని మంత్రి కేటీఆర్‌ తెలిపారు. 30 పాలసీ పేపర్లు, సిఫార్సులను ఈ సదస్సు అందించిందన్నారు. 100దేశాలు ఇప్పటిదాకా ఈ సదస్సులో పాల్గొన్నాయని, గత 20 సంవత్సరాలలో 250కి పైగా అవగాహన ఒప్పందాలను ద్వైపాక్షిక ఒప్పందాలను కుదుర్చుకోవడంలో ఈ సదస్సు భాగస్వామిగా ఉందన్నారు. ఇప్పటికే అనేక దేశాలు భాగస్వామ్య దేశాల హోదాలో ఏషియాలో పాల్గొన్నాయని కేటీఆర్‌ చెప్పారు.

తొలిసారి పాల్గొంటున్న ఆపిల్‌ కంపెనీ
ఈసారి కూడా పలు దేశాలు బయో ఏషియాతో భాగస్వామ్య దేశం హోదాలో పాల్గొంటు-న్నాయని మంత్రి కేటీఆర్‌ వివరించారు. ఇక్కడ జరుగుతున్న బయో ఆసియా సదస్సు దేశంలోని ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తుందన్నారు. తొలిసారి ఆపిల్‌ కంపెనీ కూడా పాల్గొంటోందని చెప్పారు. జీవశాస్త రంగంలో ఉన్న అపార అవకాశాలను అందిపుచ్చుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం హైదరాబాద్‌ ఫార్మసిటీ-, మెడికల్‌ డివైసెస్‌ పార్క్‌, బయో ఆసియాతోపాటు- అనేక ఇతర ప్రయత్నాలు చేస్తుందన్నారు. రాష్ట్రంలో జీవశాస్త రంగం విలువ, ఉద్యోగాలు కూడా 2028 నాటికి రెట్టింపు చేయాలన్న లక్ష్యం మేరకు పని చేస్తున్నామన్నారు.

- Advertisement -

రిజర్వ్‌ చేసిన తీర్పులు ఆశాజనకమే
2021లో హైదరాబాద్‌ దాని పరిసరాల్లోని జీవశాస్త్త్ర రంగ కంపెనీల ఏకో సిస్టమ్‌ విలువ 50 బిలియన్‌ డాలర్లు ఉండగా 2028 నాటికి దీన్ని 100 బిలియన్‌ డాలర్లకు చేరేలా ప్రణాళికలు సిద్ధం చేశామని మంత్రి కేటీఆర్‌ అన్నారు. ప్రస్తుతం ఈ రంగంలోని 4 లక్షల ఉద్యోగాలను 8 లక్షలు చేస్తామన్నారు. భవిష్యత్తులో కరోనా వంటి మహమ్మారులు ప్రబలితే ఆదుకోగల స్థాయిలో హైదరాబాద్‌ ఫార్మాసిటీ- ఉండబోతోందన్నారు. జీవశాస్త రంగంలో ఇప్పటికే అగ్రస్థానంలో ఉన్న రాష్ట్రం ఫార్మాసిటీ- ఏర్పాటు-తో మరింత ఎత్తుకు ఎదుగుతుందని ధీమా వ్యక్తం చేశారు. ఫార్మాసిటీ- విషయంలో కోర్టుల్లో ఉన్న కేసులపై విచారణ ముగిసిందని, న్యాయమూర్తులు రిజర్వ్‌ చేసిన తీర్పు తమకు అనుకూలంగా ఉంటుందని మంత్రి నమ్మకం వ్యక్తం చేశారు.

జీవశాస్త్ర రంగంలో హైదరాబాద్‌కు ప్రపంచ గుర్తింపు
జీవశాస్త రంగంలో హైదరాబాద్‌ ఇప్పటికే ప్రపంచంలోనే అతి కీలకమైన కేంద్రంగా మారిందని మంత్రి కేటీఆర్‌ వెల్లడించారు. ప్రతియేటా 900 కోట్ల టీకాలు తయారు చేస్తోందని చెప్పారు. త్వరలోనే ఈ సంఖ్య 1400 కోట్లకు చేరుతుందని, టీ-కాలన్నింటిలో తెలంగాణ వాటా 50శాతానికి చేరుతుందని తెలిపారు. అమెరికా ఫుడ్‌ అండ్‌ డ్రగ్‌ అడ్మినిస్ట్రేష్రన్‌ ఆమోదిత ఫార్మా కంపెనీలు అత్యధికంగా 214 ఉండటం, సుల్తాన్‌పూర్‌లోని మెడికల్‌ డివైజెస్‌ పార్కు, త్వరలో ప్రారంభం కానున్న ఫార్మాసిటీ- వంటివి జీవశాస్త రంగంలో హైదరాబాద్‌ స్థానాన్ని మరింత బలోపేతం చేస్తున్నదని కేటీ-ఆర్‌ విశ్వాసం వ్యక్తం చేశారు.

హైదరాబాద్‌లో డబ్లూహెచ్‌వో ఎంఆర్‌ఎన్‌ఏ టీ-కా కేంద్రం
ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్లూహెచ్‌వో) ఆధ్వర్యంలో ఎంఆర్‌ఎన్‌ఏ టీ-కా కేంద్రం కూడా త్వరలో హైదరాబాద్‌లోనే ఏర్పాటు- చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని మంత్రి కేటీఆర్‌ పేర్కొన్నారు. రాష్ట్రంలోని 33 జిల్లాల్లోనూ వైద్య కళాశాలలు ఏర్పాటు- చేస్తుండటం కూడా జీవశాస్త రంగానికి, ప్రజా ఆరోగ్య రంగాన్ని బలోపేతం చేస్తుందన్నారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హైదరాబాద్‌ ఫార్మసిటీ-కి కేంద్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి సాయం అందలేదు. హైదరాబాద్‌ ఫార్మాసిటీ-కి కేవలం జాతీయ స్థాయి ప్రాధాన్యతనే కాకుండా అంతర్జాతీయ స్థాయి ప్రాథమిక కూడా ఉంది ఎందుకంటే ఇప్పటికే తెలంగాణ రాష్ట్రం ఫార్మా మరియు లైఫ్‌ సైన్సెస్‌ రంగంలో ప్రపంచానికి అత్యంత కీలకమైన ప్రాంతంగా ఆవిర్భవించిందన్నారు. పరిశ్రమ ప్రయోజనాలు, పారిశ్రామిక అభివృద్ధి కన్నా కేవలం రాజకీయ ప్రయోజనాల నేపథ్యంలోని కేంద్ర ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటు-ందన్నారు. సరైన నాయకత్వం చిత్తశుద్ధి ఉంటే ఎన్ని అడ్డంకులనైనా దాటు-కొని అభివృద్ధి సాధించడం సాధ్యమవుతుందని తెలంగాణ రాష్ట్రం ఇప్పటికే నిరూపించిందన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement