Thursday, April 25, 2024

స‌ముద్ర‌ఖ‌నితో ప‌వ‌న్ క‌ల్యాణ్.. ముఖ్య పాత్ర‌లో సాయిధ‌ర‌మ్ తేజ్

త‌మిళంలో హిట్ కొట్టింది వినోద‌యా సితం చిత్రం.ఈ చిత్రాన్ని స‌ముద్ర‌ఖ‌ని తెర‌కెక్కిస్తున్నారు. ఈ సినిమాను తెలుగులో ప‌వ‌ర్ స్టార్ పవన్ కల్యాణ్ తో సముద్రఖని చేయనున్నాడనీ, ఇందులో సాయితేజ్ కూడా ఒక ముఖ్యమైన పాత్రను చేయనున్నాడనే టాక్ కొన్ని రోజులుగా వినిపిస్తూ వచ్చింది. అది నిజమేనని నిరూపిస్తూ తాజాగా ఈ ప్రాజెక్టు పట్టాలెక్కింది. అందుకు సంబంధించిన ఫొటోలను రిలీజ్ చేశారు. ఈ సినిమాను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ వారు నిర్మిస్తున్నారు. పవన్ క‌ల్యాణ్ .. సాయితేజ్ లకు సముద్రఖని స్క్రిప్ట్ చూపిస్తూ ఉండటం .. స్క్రిప్ట్ ను పవన్ పరిశీలిస్తూ ఉండటం .. ఒకరికి ఒకరు శుభాకాంక్షలు తెలియజేసుకోవడం ఈ ఫొటోల్లో కనిపిస్తోంది. దాంతో ప‌వ‌న్ క‌ల్యాణ్ ఫ్యాన్స్ పండ‌గ చేసుకుంటున్నారు.ఈ చిత్రం వినోద‌మే ప్ర‌ధానంగా సాగుతుంద‌ని తెలుస్తుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement