Monday, April 29, 2024

Breaking: మేడారం జాతరపై నివేదిక ఇవ్వండి: ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం

తెలంగాణలో కరోనా పరిస్థితులపై రాష్ట్ర హైకోర్టులో విచారణ జరిగింది. మేడారం సమ్మక్క జాతరపై నివేదిక కోరింది. వారంతపుసంతల్లో కరోనా జాగ్రత్తలపై కూడా నివేదిక సమర్పించాలని పేర్కొంది. రాష్ట్రంలో పాఠశాలల ప్రారంభంపై హైకోర్టు ఆరా తీసింది. ఈ నెల 31 నుంచి పాఠశాలలు తెరుస్తారా? అని ప్రశ్నించింది. అయితే, పాఠశాలలపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని ప్రభుత్వం తెలిపింది.

ఆన్ లైన్ లో హెల్త్ డైరెక్టర్ శ్రీనివాస్ విచారణకు హాజరైయ్యారు. రాష్ట్రంలో పాజిటివిటీ రేటు 3.16 శాతంగా ఉన్నట్లు తెలిపారు. 77 లక్షల ఇళ్లల్లో జ్వరం చేసి 3.45 లక్షల కిట్లు పంపిణీ చేశామని తెలిపారు. కిట్లలో పిల్లల చికిత్స ఔషధాలు లేవని న్యాయవాదులు కోర్టుకు తెలిపారు. పిల్లలకు మందులు కిట్ల రూపంలో నేరుగా ఇవ్వకూడదని డీహెచ్ అన్నారు. మూడు రోజుల్లో పూర్తి వివరాలతో నివేదిక సమర్పించాలని హైకోర్టు ఆదేశించింది. కరోనా పరిస్థితులపై తదుపరి విచారణను ఫిబ్రవరి 3కి వాయిదా వేసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement