Sunday, April 28, 2024

తెలంగాణలో మరో 10 రోజుల పాటు లాక్ డౌన్ పొడిగింపు

రాష్ట్రంలో కొనసాగుతున్న లాక్ డౌన్ ను సోమవారం నుంచి మరో పదిరోజుల పాటు కొనసాగించాలని తెలంగాణ కేబినెట్ నిర్ణయించింది. ఇందులో భాగంగా ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు సడలింపు ఉంటుంది. సడలింపు సమయం తర్వాత బయటకు వెళ్లిన వారు ఇంటికి చేరడానికి మరో గంట పాటు, అంటే మధ్యాహ్నం 2 గంటల వరకు సమయం ఇస్తారు. మధ్యాహ్నం రెండు గంటల నుంచి తెల్లారి ఉదయం ఆరు గంటల దాకా కఠినంగా లాక్ డౌన్ ను అమలు చేయాలని ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు అధ్యక్షతన ఆదివారం నాడు సమావేశమైన రాష్ట్ర  కేబినెట్ నిర్ణయించింది.

ఇప్పటివరకు ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకే కార్యకలాపాలకు అనుమతించిన ప్రభుత్వం… కేసులు తగ్గుముఖం పడుతున్న నేపథ్యంలో, ప్రజల కార్యకలాపాలకు మరికొన్ని గంటలు అదనపు సమయం ఇవ్వాలని నిర్ణయించింది. మధ్యాహ్నం 1 గంట నుంచి మరుసటి రోజు ఉదయం 6 గంటల వరకు లాక్ డౌన్ అమల్లో ఉంటుంది. దీనికి సంబంధించిన మార్గదర్శకాలు ప్రభుత్వం విడుదల చేయనుంది. ఈ మేరకు మంత్రి కేటీఆర్ వెల్లడించారు.

కరోనా సెకండ్ వేవ్ లో తెలంగాణలో భారీగా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఒక దశ 10 వేల మార్క్ ను కూడా దాటాయి. దాంతో తొలుత నైట్ కర్ఫ్యూ విధించిన రాష్ట్ర ప్రభుత్వం ఆపై కోర్టు ఒత్తిడితో మే 12 నుంచి లాక్ డౌన్ ప్రకటించింది. అయితే, ప్రస్తుతం కరోనా ఉద్ధృతి తగ్గడంతో ఆంక్షలు సడలించాలని నిర్ణయించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement