Thursday, May 2, 2024

బొజ్జ‌ల మృతికి సంతాపం తెలిపిన సీఎం కేసీఆర్ – ఆత్మీయుడిని కోల్పొయా

తెలంగాణ సీఎం కేసీఆర్..టిడిపి సీనియ‌ర్ నేత బొజ్జ‌ల మృతికి సంతాపం తెలుపుతూ ఓ ప్ర‌క‌ట‌న విడుద‌ల చేశారు. స‌హచ‌రుడు, ఆత్మీయుడిని కోల్పోయానంటూ కేసీఆర్ స‌ద‌రు ప్ర‌క‌ట‌న‌లో పేర్కొన్నారు. బొజ్జ‌ల కుటుంబ స‌భ్యుల‌కు ఆయ‌న త‌న ప్ర‌గాఢ సానుభూతిని తెలియ‌జేశారు.టీఆర్ఎస్ ఆవిర్భావానికి ముందు కేసీఆర్ కూడా టీడీపీలో కొన‌సాగిన సంగ‌తి తెలిసిందే. ఈ క్ర‌మంలో పార్టీకి చెందిన ప‌లువురు కీల‌క నేత‌ల‌తో కేసీఆర్ అత్యంత స‌న్నిహితంగా మెలిగేవారు. అలాంటి నేత‌ల్లో బొజ్జ‌ల కూడా ఒక‌రు. ఈ కార‌ణంగానే బొజ్జ‌ల మృతి వార్త తెలిసినంత‌నే త‌న ఆత్మీయుడిని కోల్పోయానంటూ కేసీఆర్ సంతాపం ప్ర‌క‌టించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement