Saturday, May 4, 2024

జిల్లాల పర్యటనకు సీఎం కేసీఆర్..

జిల్లాల పర్యటనకు సీఎం కేసీఆర్ శ్రీకారం చుడుతున్నారు. శాసనసభ సమావేశాల ప్రారంభానికి ముందే జిల్లాల పర్యటనకు వెళతానని ప్రకటించిన కేసీఆర్ఆ దిశగా కార్యాచరణ ముమ్మరం చేశారు. ఉమ్మడి వరంగల్ జిల్లా మేడారంలో జరుగుతున్న సమ్మక్క సారలమ్మ జాతరకు కేసీఆర్ శుక్రవారం వెళుతున్నారు. సీఎం కార్యక్రమం నేపథ్యంలో ములుగు జిల్లా యంత్రాంగం పటిష్ట ఏర్పాట్లు చేసింది. జాతీయ స్థాయిలో బీజేపేతర కూటమిని ఏర్పాటు చేసేందుకు కార్యాచరణ సిద్ధం చేస్తున్న కేసీఆర్ ఆదివారం ముంబై వెళతారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే ఆహ్వానం మేరకు తాను వెళుతున్నట్టు సీఎం కేసీఆర్ ప్రకటించారు. ఈనెల 21న నారాయ ణఖేడ్ లో సంగమేశ్వర బసవేశ్వర ఎత్తిపోతల పథకానికి శంకుస్థాపన చేస్తారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేస్తున్న భారీ బహింగ సభలో కేసీఆర్ ప్రసంగించనున్నారు.

సీఎం కేసీఆర్ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు ఉమ్మడి మెదక్ జిల్లాకు చెందిన ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. ఈ నెల 28వ తేదీన మల్లన్నసాగర్ రిజర్వాయరు కేసీఆర్ ప్రారం భిస్తారు. ఇప్పటికే ఉమ్మడి వరంగల్ లోని జనగామ, నల్గొండ జిల్లాలోని యాదాద్రి భువనగిరి, యాదాద్రిలో పర్యటించిన కేసీఆర్ ఈ నెలాఖరులోపు మరిన్ని జిల్లాలకు వెళ్లే అవకాశం ఉందని చెబుతున్నారు. ఈ నెల 27 లేదా మార్చి మొదటి వారంలో శాసనసభ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమవుతున్న నేపథ్యంలో ఈలోపు వీలైనన్ని ఎక్కువ జిల్లాల్లో పార్టీ కార్యక్రమాలు నిర్వహించాలన్న ప్రణాళికతో కేసీఆర్ ఉన్నటు చెబుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement