Friday, May 17, 2024

ప్రారంభ‌మైన తెలంగాణ కేబినెట్ స‌మావేశం

తెలంగాణ రాష్ట్ర మంత్రివ‌ర్గ స‌మావేశం కొత్త సచివాలయంలో తొలిసారిగా ప్రారంభ‌మైంది. ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన ప్రారంభ‌మైన ఈ స‌మావేశంలో మంత్రులతో పాటు అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ది వేడుకలపై చర్చించడంతో పాటు పలు కీలక అంశాలపై మంత్రివర్గం నిర్ణయాలు తీసుకోనున్నట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. జూన్‌ 2 నుంచి 21 రోజుల పాటు రాష్ట్రవ్యాప్తంగా తెలంగాణ అవతరణ దశాబ్ది ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలని నిర్ణయించిన విషయం తెలిసిందే.

Advertisement

తాజా వార్తలు

Advertisement