Monday, April 29, 2024

కొత్త ఫొటోలు రిలీజ్ చేసిన టీమిండియా ప్లేయర్లు.. జెర్సీలపై కొత్త లోగో

టీమిండియా ప్లేయర్లు కొత్త ఫొటోలను రిలీజ్ చేశారు. కాగా ఈ ఫొటోల్లో ప్లేయ‌ర్లు ధ‌రించిన బ్లూ జెర్సీల‌పై కొత్త లోగో ఉంది. ముంబైలో జ‌ర‌గ‌నున్న ఆ మ్యాచ్ క‌న్నా ముందే.. చాహ‌ల్ త‌న ఇన్‌స్టాలో పోస్టు చేసిన ఫోటోలో ఆ కొత్త లోగోను గుర్తుప‌ట్ట‌వ‌చ్చు. అయితే కిట్‌ స్పాన్స‌ర్‌షిప్ మారిన విష‌యంపై మాత్రం ఇప్ప‌టి వ‌ర‌కు బీసీసీఐ ఎటువంటి అధికారిక ప్ర‌క‌ట‌న చేయ‌లేదు. బీసీసీఐ కూడా త‌న ట్విట్ట‌ర్‌లో ఓ వీడియోను షేర్ చేసింది. ఆ వీడియోలో కిల్ల‌ర్ లోగో ఉన్న జెర్సీల‌ను టీమిండియా ప్లేయ‌ర్లు ధ‌రించారు. కానీ బీసీసీఐ మాత్రం దానిపై వివ‌ర‌ణ ఇవ్వ‌లేదు.శ్రీలంక‌తో నేడు టీమిండియా తొలి టీ20 మ్యాచ్ ఆడ‌నున్న విష‌యం తెలిసిందే.

Advertisement

తాజా వార్తలు

Advertisement