Friday, May 3, 2024

బీసీ నేత‌ల‌కి సంఘీభావం తెలిపిన రామ్మోహ‌న్ నాయుడు

బీసీ కుల‌గ‌ణ‌న చేప‌ట్టాల‌ని ఢిల్లీలోని జంత‌ర్ మంత‌ర్ వ‌ద్ద ఆందోళ‌న‌లు కొన‌సాగుతున్నాయి. ఈ నేప‌థ్యంలో టిడిపి ఎంపీ రామ్మోహ‌న్ నాయుడు వారికి సంఘీభావం తెలిపారు. కుల‌గ‌ణ‌న చేస్తే దేశంలో బీసీ జ‌నాభా ఎంత ఉందో తెలుస్తుంద‌ని స్ప‌ష్టం చేశారు. బీసీ కులగణన సాధించేంత వరకు తాను వారి వెంట ఉంటాన‌న్నారు. తెలుగుదేశం పార్టీకి బీసీలు వెన్నెముఖ‌గా నిలిచార‌న్నారు. బీసీలకు అండగా అన్ని పార్టీల నేతలు మద్దతుగా నిలవడం సంతోషకరమని తెలిపారు. బీసీల కార్యక్రమం ఎక్కడ జరిగినా తన తండ్రి ఎర్రన్నాయుడు ముందుండేవారని గుర్తు చేసుకున్నారు. ప్రతి సందర్భంలో పార్లమెంటులో బీసీల సమస్యలపై టీడీపీ ఎంపీలుగా పోరాడిన‌ట్లు చెప్పారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement