Wednesday, April 24, 2024

అలుగునూర్ లో దొంగతనం చేస్తూ పట్టుబడిన దొంగలు

తిమ్మపూర్, (ప్రభ న్యూస్) : క‌రీంన‌గ‌ర్ జిల్లాలోని అలుగునూర్ లో నిన్న రాత్రి ఇద్దరు దొంగలు దొంగతనం చేస్తుండగా అలుగునూర్ గ్రామానికి చెందిన కొమ్మ శ్రీనివాస్, స్థానికులు చాకచక్యంగా పట్టుకొని పోలీసులకు అప్పగించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం …సోమవారం రాత్రి సుమారు ఒకటిన్నర ప్రాంతంలో రాజరాజేశ్వర సిమెంటు, స్టీల్ దుకాణంలో షట్టర్ లేపి ఇద్దరు దొంగలు దొంగతనం చేసి బయటికి వస్తున్న క్రమంలో అప్పుడే మూత్ర విసర్జన కోసం బయటికి వచ్చిన కొమ్మ శ్రీనివాస్ వారిని గమనించి ఎవరు మీరు అని అడగ్గా ఆ ఇద్దరు దొంగలు అక్కడి నుండి పారిపోయే ప్రయత్నం చేయగా అందులో ఒకరిని శ్రీనివాస్ చాకచక్యంగా పట్టుకొనే ప్రయత్నం చేయగా… అప్పుడు ఆ దొంగ తన చేతిలో ఉన్న ఇనుప రాడ్ తో శ్రీనివాస్ పై దాడి చేయగా శ్రీనివాస్ తలకు రక్త గాయమైంది.

వెంటనే శ్రీనివాస్ కేకలు వేయగా చుట్టుపక్కల వారు వచ్చి ఆ దొంగలను పట్టుకునే ప్రయత్నం చేయగా ఇంకొక దొంగ అక్కడే ఉన్న బైక్ స్టార్ట్ చేసుకొని పారిపోయాడు. అప్పుడు శ్రీనివాస్ పట్టుకున్న దొంగను చుట్టుపక్కల వారు బందించి రాజరాజేశ్వర సిమెంట్ స్టీలు దుకాణం యజమానికి సమాచారం అందించగా అక్కడికి చేరుకున్న దుకాణం యజమాని షాపులో పరిశీలించగా పది వేల రూపాయల నగదు పోయినట్లు చెప్పాడు. వెంటనే పోలీసు వారికి సమాచారం అందించగా హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఆ దొంగను కస్టడీలోకి తీసుకున్నారు. శ్రీనివాస్ ఇచ్చిన పిర్యాదు హెచ్ఓఎల్ ఫర్నిచర్ అండ్ సానిటరీ షాప్ నందు 1500 రూపాయల దొంగతనం జ‌రిగిన‌ట్లు షాప్ యజమాని ఫిర్యాదులపై రెండు కేసులు మోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎల్ఎండీ ఎస్సై ప్రమోద్ రెడ్డి తెలిపారు. ఈ దొంగను చాకచక్యంగా తన ప్రాణాలకు తెగించి పట్టుకున్న కొమ్మ శ్రీనివాస్ ను రూరల్ ఏసీపీ విజయసారథి తిమ్మాపూర్ సిఐ శశిధర్ రెడ్డి లు అభినందించారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement