Monday, April 29, 2024

బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధాని మోడీ భేటీ

ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ ఉత్తర ప్రదేశ్ లో రెండోరోజు ప‌ర్య‌టిస్తున్నారు. ఈ పర్యటనలో భాగంగా ప్రధాని మోడీ ఇవాళ‌ బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులతో భేటీ అయ్యారు. ప్రధాని మోడీ అధ్యక్షతన సుపరిపాలనపై సెమినార్ నిర్వహించారు. ఆయా రాష్ట్రాల్లో కోవిడ్ పరిస్థితులు, సమస్యలపై ప్రధాని ముఖ్య‌మంత్రుల‌తో చర్చించినట్లు తెలుస్తోంది. అలాగే, పార్టీ బలోపేతం, భవిష్యత్ కార్యాచరణ సహా మరిన్ని అంశాలపై బీజేపీ సీఎంలతో ప్రధాని మోడీ చర్చించారు. యూపీ సహా పలు రాష్ట్రాల్లో వచ్చే ఏడాది ఎన్నికలు జరగనున్న నేప‌థ్యంలో ఈ భేటీకి ప్రాధాన్యత సంతరించుకొంది.
ఇదిలా ఉండగా.. ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం వారణాసిలో రూ.339 కోట్ల వ్య‌యంతో పూర్తిచేసిన కాశీ విశ్వ‌నాథ్ ధామ్ మొద‌టి ద‌శ‌ను ప్రారంభించిన విషయం విదితమే. ఈ గంగానదిపై ఉన్న రెండు ఘాట్ లతో పురాతన కాశీ విశ్వనాథ ఆలయాన్నిఈ కారిడార్ కలపనుంది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement