Saturday, May 4, 2024

టీఆర్ఎస్‌లో చేరిన టీడీపీ కీలక నేత

తెలంగాణలో టీడీపీ మొత్తం ఖాళీ అవుతోంది. ఇప్పటికే ఆ పార్టీ అధ్యక్షుడు ఎల్.రమణ ఇటీవల టీఆర్ఎస్ తీర్ధం పుచ్చుకున్నారు. ఉన్న కొద్దిమంది కూడా వేరే పార్టీల వైపు చూస్తున్నారు. తాజాగా మరో టీడీపీ కీలక నేత కూడా కారెక్కారు. హుజూరాబాద్‌ నియోజకవర్గంలో వివిధ పార్టీల నేత‌లు సీఎం కేసీఆర్ ప‌థ‌కాల‌కు ఆక‌ర్షితులై గులాబీ గూటికి చేరుతున్నారు.

శుక్రవారం నాడు తెలుగుదేశం క‌రీంన‌గ‌ర్ జిల్లా రైతు సంఘం అధ్య‌క్షుడు ముచ్చ స‌మ్మిరెడ్డి టీఆర్ఎస్ పార్టీలో చేరారు. స‌మ్మిరెడ్డికి పాడి కౌశిక్ రెడ్డి గులాబీ కండువా క‌ప్పి పార్టీలోకి సాద‌రంగా ఆహ్వానించారు. స‌మ్మిరెడ్డి గ‌తంలో ద‌మ్మ‌క్కపేట ఎంపీటీసీగా సేవ‌లందించారు. హుజూరాబాద్ నియోజ‌క‌వ‌ర్గంలో టీఆర్ఎస్ అభ్య‌ర్థి గెల్లు శ్రీనివాస్ యాద‌వ్ గెలుపు కోసం కృషి చేస్తాన‌ని స‌మ్మిరెడ్డి స్ప‌ష్టం చేశారు.

ఈ వార్త కూడా చదవండి: బండి సంజయ్ పాదయాత్ర పేరు ఖరారు

Advertisement

తాజా వార్తలు

Advertisement