Tuesday, May 14, 2024

సీఎం జ‌గ‌న్ తో చాలా మాట్లాడా- తిరుప‌తిలో స్టూడియో పెడ‌తా – మంచు విష్ణు

ఏపీ ముఖ్యమంత్రి జగన్ తో హీరో మంచు విష్ణు భేటీ ముగిసింది. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ .. వివరాలను వెల్లడించారు. సీఎంతో తాను చాలా విషయాల గురించి మాట్లాడానని చెప్పారు. జగన్ తో మాట్లాడిన విషయాలు వ్యక్తిగతమైనవని అన్నారు. సినీ పరిశ్రమ సమస్యలపై కూడా చర్చించామని చెప్పారు. సినీ పరిశ్రమకు ఏపీ, తెలంగాణలు రెండు కళ్లు అని చెప్పారు. సినీ పరిశ్రమ మొత్తం ఒకే కుటుంబమని అన్నారు.తిరుపతిలో తాను సినిమా స్టూడియో పెడతానని తెలిపారు. ముఖ్యమంత్రితో చర్చలకు నాన్న గారిని పిలవలేదనేది దుష్ప్రచారమని చెప్పారు. విశాఖకు సినీ పరిశ్రమను ఎలా తరలించాలనే విషయంపై ఆలోచిస్తామని తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement