Sunday, May 5, 2024

ఆఫ్గన్ లో రెచ్చిపోతున్న తాలిబన్లు.. 150 మంది కిడ్నాప్!

ఆఫ్ఘనిస్తాన్ లో తాలిబన్ల అరాచకాలు పెరిగిపోతున్నాయి. రెండు రోజులు పాటు శాంతికాముకులుగా నటించిన ముష్కరులు.. తమ అసలు స్వరూపాన్ని క్రమంగా బయటపెడుతున్నారు. తాజాగా కాబుల్ అంతర్జాతీయ విమానాశ్రయ సమీపంలో 150 మంది పౌరులను తాలిబన్లు కిడ్నాప్‌ చేసినట్లు స్థానిక మీడియా పేర్కొంది. అఫ్గాన్‌ నుంచి ఇతర దేశాలకు వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నవారిని నిర్బంధించినట్లు తెలుస్తోంది. వారిలో భారతీయుల సంఖ్య ఎక్కువగా ఉన్నట్లు అఫ్గన్ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి. ఈ వార్తల నేపథ్యంలో భారత విదేశాంగ వెంటనే అప్రమత్తమైంది. అపహరణకు గురైన భారతీయులకు తాలిబన్ల నుంచి ఏ ప్రమాదం లేదని ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి.

ఇది కూడా చదవండిః హుజురాబాద్ బరిలో కొండా.. టీ.పీసీసీ ఆలోచన ఏంటో?

Advertisement

తాజా వార్తలు

Advertisement