Tuesday, May 7, 2024

కృష్ణంరాజుకి స‌ర్జ‌రీ – క్షేమంగా ఉన్నార‌ని ప్ర‌క‌ట‌న‌

ప్ర‌ముఖ న‌టుడు, నిర్మాత కృష్ణంరాజుకు చిన్న స‌ర్జ‌రీ జ‌రిగింద‌ట‌. ఈ స‌ర్జ‌రీలో భాగంగా ఆయ‌న కాలు వేలు తొల‌గించాల్సి వ‌చ్చింద‌ని తెలుస్తోంది. కాగా కృష్ణంరాజు క్షేమంగా ఉన్నారని ఆయన కుటుంబ సభ్యులు వెల్లడించారు. అయితే ఈ విషయాన్ని మీడియాకు తెలియకుండా గోప్యంగా ఉంచారు కృష్ణంరాజు కుటుంబ సభ్యులు. ఇక ఆపరేషన్ నేపథ్యంలో హీరో ప్రభాస్… ఒక రోజు మొత్తం ఆస్పత్రిలో ఉన్నట్లు తెలుస్తోంది. కృష్ణంరాజు నిర్మాణం లో రాధేశ్యామ్ చిత్రం రూపొందింది. ఈ సినిమాలో కృష్ణంరాజు ఓ కీలక పాత్ర పోషించారు. ఈనెల 11వ తేదీన రాజ్యం సినిమా విడుదల కాబోతోంది. ఈ సినిమా ప్రమోషన్ లో తాను కూడా పాల్గొనాలని కృష్ణంరాజు భావించారు. కానీ ఆయన ఆరోగ్యం సహకరించలేదు.

Advertisement

తాజా వార్తలు

Advertisement