Friday, April 26, 2024

‘ర‌మేష్ బాబు’ భౌతిక‌కాయాన్ని చూసి చ‌లించిపోయిన కృష్ణ

కొడుకు భౌతిక‌కాయాన్ని చూసి సూప‌ర్ స్టార్ కృష్ణ చ‌లించిపోయారు. క‌న్నీళ్ల‌తో త‌న కొడుకు ర‌మేష్ బాబుకి నివాళుల‌ర్పించారు. ర‌మేష్ బాబు మృతితో టాలీవుడ్ శోక‌సంద్రంలో మునిగిపోయింది. ప‌ద్మాల‌య స్టూడియోస్ కి ర‌మేష్ బాబు భౌతిక‌కాయాన్ని త‌ర‌లించారు. నేడు టాలీవుడ్‌ నటుడు రమేష్ బాబు అంత్యక్రియలు జరుగనున్నాయి. మధ్యాహ్నం 12 గంటలకు సమయంలో మహా ప్రస్థానంలోనే నటుడు రమేష్ బాబు అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు ఆయన కుటుంబ సభ్యులు ప్రకటించారు. ఇందులో భాగంగానే… కాసేపటి క్రితమే… పద్మాలయ స్టూడియోకు రమేష్ బాబు భౌతిక కాయాన్ని తరలించారు కుటుంబ సభ్యులు. దీంతో పద్మాలయకు ఇతర కుటుంబ సభ్యులు, బంధువులు, సీని ప్రముఖులు చేరుకుంటున్నారు. అటు రమేష్‌ బాబు భౌతికకాయానికి పలువురు సినీ ప్రముఖులు నివాళులర్పిస్తున్నారు. కొంత మంది సోషల్‌ మీడియా వేదికగా స్పందిస్తున్నారు.

కాగా…ఘట్టమనేని రమేష్‌ బాబు నిన్న అనారోగ్యంతో… మరణించిన సంగతి తెలిసిందే. కాలేయ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న రమేష్‌ బాబు శనివారం సాయంత్రం తవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో కుటుంబ సభ్యులు హుటా హుటిన ఆయనను గచ్చి బౌలిలోని ఏఐజీ ఆస్పత్రికి తరలించారు. అంతలోనే రమేష్‌ బాబు తుది శ్వాస విడిచారు. అయితే.. అన్న రమేష్‌ బాబు అంత్యక్రియలకు మహేష్‌ బాబు దూరం కానున్నట్లు సమాచారం.

Advertisement

తాజా వార్తలు

Advertisement