Friday, April 26, 2024

హిజాబ్ ధ‌రించి ప‌రీక్ష‌లు రాసిన విద్యార్థినులు – ఏడుగురు ఉపాధ్యాయుల స‌స్పెన్ష‌న్

సీఎస్ పాటిల్ బాలిక‌ల ఉన్న‌త పాఠ‌శాల‌ల్లో ఎస్ ఎస్ ఎల్ సీ ప‌రీక్ష‌ల‌కు ప‌లువురు విద్యార్థినులు హిజాబ్ ధ‌రించి వ‌చ్చి ప‌రీక్ష‌లు రాశారు. హిజాబ్ తో విద్యార్థుల‌ను ప‌రీక్ష‌ల‌కు అనుమతించ‌నందుకు ఏడుగురు ఉపాధ్యాయుల‌పై అధికారులు స‌స్పెన్ష‌న్ వేటు వేశారు. అంతేకాదు, ఇద్దరు సెంటర్ సూపరింటెండెంట్లపై కూడా సస్పెన్ష‌న్ వేటు పడింది. కాగా, కర్ణాటక విద్యాల‌యాల్లో హిజాబ్ నిషేధాన్ని సవాలు చేస్తూ దాఖలైన అన్ని పిటిషన్లను కొన్ని రోజుల క్రితం కర్ణాటక హైకోర్టు కొట్టివేసిన విష‌యం తెలిసిందే.
అయితే క‌ర్ణాట‌క‌లో హిజాబ్ వివాదం ఇంకా కొన‌సాగుతూనే ఉంది. తాజాగా, గదగ్‌లోని సీఎస్‌ పాటిల్‌ బాలుర ఉన్నత పాఠశాలలో ఈ ఘ‌ట‌న చోటు చేసుకుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement