Tuesday, May 7, 2024

ఉగాదికి ‘స‌ర్కార్ వారి పాట’ నుంచి మూడోసింగిల్ – ఆ సీన్ హైలెట్

టాలీవుడ్ సూప‌ర్ స్టార్ మ‌హేశ్ బాబు నటిస్తోన్న తాజా చిత్రం స‌ర్కార్ వారి పాట‌. ఈ చిత్రంలోని కీలక యాక్షన్ ఎపిసోడ్ ను కొద్ది రోజుల కిందట హైదరాబాద్ లో రైల్వేస్టేషన్ సెట్ వేసి చిత్రీకరించినట్లు తెలుస్తోంది. ఆ ఎపిసోడ్ సీన్స్ సినిమాకు హైలైట్ గా నిలుస్తాయని మేకర్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇందులో మహేశ్ సరసన ‘మహానటి’ కీర్తి సురేశ్ హీరోయిన్ గా నటించగా, ‘కళావతి, పెన్నీ’ పాటలకు సూపర్బ్ రెస్పాన్స్ వస్తోంది. ఈ చిత్రంలో కామెడీ సీన్స్ హైలైట్ గా ఉంటాయట. వెన్నెల కిషోర్, మహేశ్..కామెడీ సీన్స్ లో ప్రేక్షకులను కడుపుబ్బ నవ్వించేస్తారట. అంచనాలు ఎలా ఉన్నప్పటికీ సినిమా మాత్రం అంచనాలను మించి ఉంటుందని దర్శకుడు పరశురామ్ తెలిపాడు. ఈ చిత్రం ఈ ఏడాది మే 12న రిలీజ్ కానుంది. ఉగాది కానుకగా ఈ సినిమా నుంచి ఎలాంటి అప్ డేట్ రానుందనేది ఆసక్తికరంగా మారింది. ఉగాది’ రోజున ఈ సినిమా నుంచి మూడో సింగిల్ ను వదలనున్నారనే ఒక టాక్ బలంగా వినిపిస్తోంది. మరి మూడో సాంగ్ రిలీజ్ చేస్తారా? ట్రైలర్ వదులుతారా? అనేది చూడాలి.

Advertisement

తాజా వార్తలు

Advertisement