Friday, April 26, 2024

ప్రాణం తీసిన సెల్ఫీ సరదా.. కాలువలో పడి విద్యార్ధి గల్లంతు

కరీంనగర్ జిల్లా హుజురాబాద్ మండలం తుమ్మనపల్లి SRSP కాలువలో పడి నవనీత్ అనే ఇంజనీరింగ్ కాలేజి విద్యార్థి గల్లంతయ్యాడు. సోమవారం కాలువపై ఉన్న మిషన్ భగీరథ పైపు లైన్ పై ఆరుగురు విద్యార్థులు సెల్ఫీ దిగుతుండగా ప్రమాదవశాత్తు కాలువలో పడిపోయారు. ఐదుగురు విద్యార్థులు ఒడ్డుకు చేరుకోగా నవనీత్ అనే విద్యార్థి గల్లంతయ్యారు.

ఖమ్మం పట్టణానికి నవనీత్ తో పాటు విద్యార్థులంతా హుజూరాబాద్ మండలం లోని సింగపూర్ కిట్స్ కాలేజీలో విద్యనభ్యసిస్తున్నారు. నవనీత్ ఇంజనీరింగ్ ఫైనల్ ఇయర్ చదువుతున్నాడు. విషయం తెలుసుకున్న ఫైర్, పోలీస్ సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకొని మృత దేహం కోసం గాలింపు చర్యలు చేపట్టారు. కెనాల్ లో నీటి ప్రవాహం ఎక్కువగా ఉండటంతో ఇంకా మృతదేహం లభ్యం కాలేదు.

Advertisement

తాజా వార్తలు

Advertisement