Monday, May 6, 2024

బీఆర్ఎస్ పై ప్ర‌జ‌ల్లో తీవ్ర వ్య‌తిరేక‌త‌.. కిష‌న్ రెడ్డి

బీఆర్ఎస్ పై, కేసీఆర్ పై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని, బీఆర్ఎస్ ను బ్రహ్మదేవుడు కూడా కాపాడలేడని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ.. బీఆర్ఎస్ అధికారంలో ఉండేది ఇంకా ఆరు నెలలేనన్నారు. అధికారంలో ఎవరున్నా అభివృద్ధిని ఆపొద్దని సూచించారు. ఏప్రిల్ 8న‌ సికాంద్రాబాద్ లో మోడీ సభతో పెను మార్పులుంటాయన్నారు కిషన్ రెడ్డి. ఏప్రిల్ 8న సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ పునర్నిర్మాణం చేస్తున్నామని కిషన్ రెడ్డి వెల్లడించారు. రూ.1400 కోట్లతో జరిగిన డబ్లింగ్ పనులను మోడీ ప్రారంభిస్తారని చెప్పారు.

రూ.7764 కోట్లతో చేపట్టే నూతన జాతీయ రహాదారులకు ప్రధాని భూమి పూజ చేస్తారని తెలిపారు. ఏప్రిల్ 8న రూ.1366 కోట్లతో బీబీనగర్ ఎయిమ్స్ నూతన భవనానికి శంకుస్థాపన చేస్తామన్నారు. ట్రిపుల్ నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం రూ.500 కోట్లు కేటాయించినా ఇప్పటి వరకు ఒక్క రూపాయి ఇవ్వలేదన్నారు. అనేక అభివృద్ధి పనుల్లో రాష్ట్ర ప్రభుత్వం సహకరించడం లేదని ఆరోపించారు.ఏప్రిల్ 8న ప్రారంభించనున్న రెండో వందేభారత్ ట్రైన్ వల్ల హైదరాబాద్ టూ తిరుపతి ప్రయాణం మరింత ఈజీ కానుందన్నారు. వందేభారత్ ట్రైన్ వల్ల తిరుపతికి వెళ్లేవారు త్వరగా వెళతారని చెప్పారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement