Saturday, May 18, 2024

సత్యాహింసల మార్గదర్శివర్ధమాన మహావీరుడు

రాజకుటుంబంలో పుట్టినా 30 సంవత్సరాల వయసులోనే ప్రాపంచిక సుఖాలను వదులుకున్నారు.
జ్ఞాన అన్వేషణలో ఒక పుష్కర కాలం (12సం.) కఠినమైన తపస్సు చేశారు. జైనమత ప్రచారానికి ఆయన చేసిన కృషి అనన్యం. మగధలో తన మూలాలను స్థాపించిన ఆయన జైన మతాన్ని దక్షిణ భారతదేశం వైపునకు విస్తరించారు సత్య, అహింస, అస్తేయ, అపరిగ్రహ, బ్రహ్మచర్య అనే ఐదు జీవితన సూత్రాల ప్రాముఖ్యతను ప్రజలకు తెలియజేసారు. ఆయనే 24వ తీర్థంకరుడైన లార్డ్‌ మహావీర్‌. ఆయన బోధించిన పంచ సూత్రాలు జీవితంలో ప్రతి ఒక్కరికి ఉపయోగపడతాయి.
వేద యుగంలో పెరిగిన జీవహంస, ఖర్చుతో కూడిన యజ్ఞ యాగాలు, క్రతువు లు, సమాజంలో పేరుకుపోయిన వర్ణ వివక్ష, మత వైషమ్యాలు, ఆర్థిక అసమా నతలు ఆలోచనాపరులైన కొద్దిమందిలో జిజ్ఞాసను రేకెత్తించాయి. వీటిని అధిగ మించడానికి అజీవకులు, చార్వాకులు, జైన, బౌద్ధ మత కర్తలైన… మహావీరుడు, బుద్ధు డు వంటివారు క్రీ.పూ 6వ శతాబ్దంలో భావవికాసానికి నాంది పలికారు.
జైన మతాన్ని అనుసరించేవారు జైనులు. జినులు అంటే కోరికలను జయించినవా రు అని అర్థం. జైన మతాన్ని వృషభ నాథుడు స్థాపించగా, ఇది ‘జిన’ (విజేత) అనే పదం నుంచి వచ్చింది. జైన మత గురువులను తీర్థంకరులని పిలుస్తారు. తీర్థంకరులంటే పూర్ణ పురుషులు. జీవన ప్రవాహాన్ని దాటడానికి వారధి నిర్మించినవారు. జైనమతంలో తొలి తీర్థంకరుడు వృషభ నాథుడు కాగా, ఆయన గురించి ఋగ్వేదంలో పేర్కొనబడింది. అంతేకాదు విష్ణు పురాణం, భాగవత పురాణంలో నారాయణావతారంగా కీర్తించబడ్డా డు. దీనినిబట్టి జైన మతం ఋగ్వేద మతం అంతటి ప్రాచీనమైంది. ఇక, చిట్టచివరి ఇరవై నాలుగో తీర్థంకరుడు వర్థమాన మహావీరుడని జైనుల విశ్వాసం.
బీహార్‌లో వైశాలికి సమీపములో కుండ గ్రామంలో క్రీ.పూ. 599లో (అధిక సంఖ్యా కుల విశ్వాసం) క్షత్రియ కుటుంబములో సిద్దార్ధ మహారాజుకు, రాణి త్రిషలకు జన్మించిన మహావీరుడికి తల్లిదండ్రులు పెట్టిన పేరు వర్ధమానుడు. కొందరు జైనులు మాత్రం మహ వీరుడు క్రీస్తు పూర్వం 599లో జన్మించాడని నమ్ముతుండగా, మరికొందరు క్రీస్తు పూర్వం 615లో జన్మించాడని భావిస్తున్నారు. అయితే ఇందులో దేనికీ స్పష్టమైన ఆధారాలులేవు. హందూ క్యాలెండర్‌ ప్రకారం చైత్రమాసం 13వ రోజున అంటే చైత్ర శుక్ల త్రయోదశి రోజు న మహావీరుడు జన్మించారు. అల్లారు ముద్దుగా పెరిగిన మహావీరుడు తల్లిదండ్రులు 28వ ఏట మరణించారు. యశోధరను వివాహమాడి, ఓ కుమార్తెకు జన్మనిచ్చిన తరువా త మహవీరుడు అకస్మాత్తుగా తన సింహాసనాన్ని, కుటుంబాన్ని విడిచి పెట్టి సత్యాన్వేషణ కోసం స్వయంగా బయలుదేరాడు. తన 30వ ఏట గృహస్థ్యాన్ని త్యజించి, ఆరు సంవత్సరాలు మక్కలి గోశాలుని శిష్యునిగా ఉన్నాడు. 36వ ఏట సన్యాసాన్ని స్వీకరించి, వర్ధమానుడు ఆ తరువాత రిజుపాలిక నదీ తీరంలోని జృంబిక గ్రామం దగ్గర కఠోర తపస్సు చేశాడు. తన 43వ ఏట సాలవృక్షం కింద వైశాఖ మాసం పదమూడో రోజున జృంభిక గ్రామంలో జ్ఞానోదయం కలిగింది. తద్వారా తపోసిద్ధిని పొందాడు. తర్వాత ఆయన మహావీరుడిగా మారాడు. తదనంతరం… వర్ధమానుడు మగధ రాజ్యాల తోపాటు తూర్పునకు వెళ్లి తన తత్త్వాన్ని, సిద్ధాంతాలను బోధించాడు. బింబిసారుడు, అజాత శత్రువు తదితర రాజులను కలుసుకున్నాడు.
అప్పటికే జైన మతానికి 23మంది తీర్ధంకరులుగా ఉన్నప్పటికీ మహావీరుడు బాధ్యతలు చేపట్టిన తర్వాతే ఆ మతానికి సంబంధించిన వివరాలు వెలుగు చూశాయి. 32ఏళ్ళ పాటు అహంసా ధర్మముతో ప్రచారం జరిపిన మహావీరుడు తన 72వ ఏట క్రీ.పూ. 527లో పావాపురిలో దేహాన్ని త్యజించాడు.

మహావీరుని బోధనలు

వైదిక కర్మలు చేయడం, దేవుణ్ని వేడు కోవడం వల్ల మనిషికి ఉపయోగం లేదు.
చెడు చేయకుండా మంచి జీవితాన్ని గడపడమే మోక్ష మార్గం.
జైనమత ప్రకారం ‘ఆత్మ’ ప్రాణులకే కాదు, ప్రతి వస్తువులోను ఉంటుంది. దేవుడితో నిమిత్తం లేదు.
సమ్యక్‌ దర్శనం, సమ్యక్‌ జ్ఞానం, సమ్యక్‌ చరిత్ర- మోక్ష మార్గాలు. వీటిని ‘త్రిరత్నాలు’ అంటారు. (సరైన విశ్వాసం, సరైన జ్ఞానం, సరైన నడవడి)
పార్శ్వ నాధుడు ప్రతిపాదించిన సత్య, అహంస, అపరిగ్రహ, అనస్తేయ అనే నాలుగు మూల సూత్రాలకు మహావీరుడు బ్రహ్మచర్య సూత్రాన్ని అదనంగా జోడించాడు. వీటిని ‘పంచానువ్రత’ అని పిలుస్తారు.
పోర్శ్వనాధుడు శ్వేతాంబర వాదాన్ని, మహావీరుడు దిగంబర వాదాన్ని సమ ర్థించారు.
మెహావీరుని అనుచరులనుని గ్రంధులు అంటారు (బంధాల నుంచి విముక్తి పొందిన వారు).
మహావీరుడు తన 72వ యేట తుదిశ్వాస విడిచారు. అప్పటికే 23మంది తీర్థంకులు ఉన్నా మహావీరుని హయాంలో జైనమతానికి విశేష ప్రాధాన్యత లభించింది. భారతదేశం నలువైపులా వ్యాపించింది. 32 సంవత్సరాలపాటు అహింస, ధర్మం గురించి ప్రచారం చేసిన మహావీరుడు జైనులకు ఆరాధ్య దైవమయ్యాడు. అందుకే ఆయన
చంద్రగుప్త మౌర్యుడు సల్లేఖనం ద్వారా పరమపదించాడు. భారతీయ వాస్తు ్ఖశిల్ప కళాభివృద్ధికి జైనమతం గొప్ప సేవ చేసింది. మహావీరుడు సాధారణంగా కూర్చొని లేదా నిలబడి ధ్యాన భంగిమలో, అతని క్రింద ఉన్న సింహం చిహ్నంగా చిత్రీకరించ బడింది. ఉత్తర భారతదేశంలోని మధురలోని పురావస్తు ప్రాంతాల నుండి అతని మొట్టమొదటి విగ్రహాన్ని క్రీ.పూ 1వ శతాబ్దం నుండి క్రీ. శ. 2వ శతాబ్దంకి చెందినది. అయన పుట్టిన రోజును మహావీర్‌ జయంతిగా జరుపుకుంటారు.
చిన్న వయసులోనే ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రజలకు సత్యం, అహంస, ప్రేమ మార్గాన్ని చూపించిన మహావీరుని జయంతి సందర్భంగా జైన మతానికి చెందిన వారు వివిధ కార్యకలాపాల్లో పాల్గొంటారు. మహవీరుని ఊరేగింపు కూడా నిర్వ#హస్తారు. దీని ద్వారా మహవీరుని సందేశాన్ని తెలియ జేయడా నికి ప్రయత్నిస్తారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement