Wednesday, May 15, 2024

న‌ష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు

నేటి స్టాక్ మార్కెట్లు న‌ష్టాల‌తో ముగిశాయి. ర‌ష్యా,ఉక్రెయిన్ దేశాల మ‌ధ్య నెల‌కొన్న యుద్ధ‌వాతావ‌ర‌ణం ప్ర‌పంచ మార్కెట్ల‌పై తీవ్ర ప్ర‌భావాన్ని చూప‌డంతో స్టాక్ మార్కెట్లు ఒడిదుడుకుల‌ను ఎదుర్కొన్నాయ‌. నష్టాలతో ప్రారంభమైన సూచీలు మధ్యాహ్నం లాభాల్లోకి మళ్లి, చివరకు నష్టాల్లో ముగిశాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 59 పాయింట్లు నష్టపోయి 57,832కి పడిపోయింది. నిఫ్టీ 28 పాయింట్లు కోల్పోయి 17,276 వద్ద స్థిరపడింది. హెచ్డీఎఫ్సీ లిమిటెడ్ (1.25%), ఎల్ అండ్ టీ (0.66%), యాక్సిస్ బ్యాంక్ (0.57%), స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (0.52%), డాక్టర్ రెడ్డీస్ లేబొరేటరీస్ (0.44%) బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్ గా నిలిచాయి. అల్ట్రాటెక్ సిమెంట్ (-1.88%), మహీంద్రా అండ్ మహీంద్రా (-1.36%), ఇన్ఫోసిస్ (-1.06%), రిలయన్స్ ఇండస్ట్రీస్ (-0.85%), బజాజ్ ఫైనాన్స్ (-0.74%)టాప్ లూజర్స్ గా మిగిలాయి.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement