Thursday, May 2, 2024

నకిలీ ఉంగరాన్ని అమ్మిన శ్రీవాత్సవ జ్యువెల్లర్స్‌.. కోర్టు ఆదేశాలతో కేసు నమోదు

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : శ్రీ వాత్సవ జ్యూవెల్లర్స్‌పైన జూబ్లిdహిల్స్‌ పోలీస్‌ స్టేషన్‌లో కేసు నమోదు అయ్యింది. 2014లో శ్రీ వాత్సవ జ్యూవెల్లర్స్‌లో దుర్గాప్రసాద్‌ అనే వ్యక్తి బంగారు ఉంగరాన్ని కొనుగోలు చేశారు. నెల రోజుల క్రితం ఉంగరాన్ని వేరే జ్యూవెల్లర్స్‌లో అమ్మడానికి వెళ్ళగా నాసిీరకమని, దానిని కొన్న చోటనే అమ్మమని సలహా ఇచ్చారు. దీంతో దుర్గాప్రసాద్‌ శ్రీవాత్సవ జ్యువెల్లర్స్‌కు వెళ్ళగా ఉంగరాన్ని తాము కొనుగోలు చేసేది లేదని తేల్చి చెప్పారు. దీంతో తాను మోసపోయానని గ్రహించిన దుర్గాప్రసాద్‌ కోర్టుని ఆశ్రయించగా విచారణ చేసి రిపోర్టు పంపించమని జూబ్లిdహిల్స్‌ పీఎస్‌ ఎస్‌హెచ్‌వోని ఆదేశించింది. కోర్టు ఆదేశాలతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు.

Advertisement

తాజా వార్తలు

Advertisement