Monday, April 29, 2024

AP Assembly: టీడీపీ సభ్యులపై స్పీకర్ ఆగ్రహం

ఆంధ్రప్రదేశ్‌ శాసనసభ సమావేశాలు కొనసాగుతున్నాయి. అయితే, సమావేశాలు ప్రారంభమైన తొలి రోజు టీడీపీ సభ్యులపై స్పీకర్ తమ్మినేని ఆగ్రహం వ్యక్తం చేశారు. పెట్రో ధరలపై టీడీపీ వాయిదా తీర్మానాన్ని అందజేసింది. అయితే, టీడీపీ ఇచ్చిన వాయిదా తీర్మానాన్ని స్పీకర్ తిరస్కరించారు. వాయిదా తీర్మానాన్ని తిరస్కరించడంపై టీడీపీ ఎమ్మెల్యేలు నిరసనకు దిగారు. ఈ క్రమంలో టీడీపీ ఎమ్మెల్యేలపై స్పీకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘సాంప్రదాయాలు నాకు తెలుసు… మీరు చెప్పినట్లు నేను సభ నడపాలా’’అని స్పీకర్ మండిపడ్డారు. దీంతో టీడీపీ ఎమ్మెల్యేలు తమ నిరసనను కొనసాగించారు. దేశంలో ఎక్కడా లేనంత పెట్రో భారం ఏపీ ప్రజలపై ఉందని టీడీపీ సభ్యులు నినాదాలు చేశారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌, ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

https://twitter.com/AndhraPrabhaApp, https://www.facebook.com/andhraprabhanewsdaily

Advertisement

తాజా వార్తలు

Advertisement