Thursday, May 2, 2024

గుజరాత్ లో ఘోర రోడ్డు ప్రమాదం… ఆరుగురు మృతి

గుజరాత్‌ రాష్ట్రంలో జరిగిన ఘోర రోడ్డుప్రమాదంలో ఆరుగురు మృతిచెందారు. రాష్ట్రంలోని ఆనంద్‌ జిల్లాలో ఓ కారు డ్రైవర్‌ నిర్లక్ష్యం ఆరుగురి ప్రాణాలను బలితీసుకుంది. ఆనంద్‌ జిల్లాలోని దాలీ గ్రామంలో వేగంగా వస్తున్న కారు అదుపుతప్ప ఆటో, బైకులను ఢీకొట్టింది. దీంతో ఆరుగురు అక్కడికక్కడే మృతిచెందారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతుల్లో ఆటోలో ప్రయాణిస్తున్న నలుగురు, మోటారు సైకిల్‌పై వెళ్తున్న ఇద్దరు ఉన్నారని చెప్పారు. కారు డ్రైవరు తీవ్రంగా గాయపడటంతో అతడిని ఆస్పత్రికి తరలించారు. కారు అతివేగం వల్లే ఈ ప్రమాదం జరిగిందని అసిస్టెంట్ పోలీసు సూపరింటెండెంట్ అభిషేక్ గుప్తా తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement