Friday, April 26, 2024

Breaking: జగన్నాథుడి దర్శనానికి ఏర్పాట్లు.. మళ్లీ ఓపెన్​ చేసిన పూరీ టెంపుల్​

పూరీ జగన్నాథుడి ఆలయాన్ని భక్తుల దర్శనార్థం ఓపెన్​ చేసినట్టు ఆలయ నిర్వాహకులు తెలిపారు. ఒడిశా రాష్ట్రం పూరీలోని శ్రీ జగన్నాథ దేవాలయం కొవిడ్​ ప్రోటోకాల్‌ని అనుసరిస్తూ తిరిగి ప్రారంభిస్తున్నట్టు వెల్లడించారు. పునఃప్రారంభమైన మొదటి రోజు  ఊహించిన దాని కంటే జనాలు తక్కువగానే వచ్చారు.  కాగా, కరోనా థర్డ్​ వేవ్​ నేపథ్యంలో జనవరి 10 వ తేదీన ఈ ఆలయాన్ని మూసివేశారు.  అయితే  జగన్నాథ దేవాలయం అడ్మినిస్ట్రేషన్ (SJTA) భక్తులకు సాఫీగా దర్శనం కల్పించేందుకు తగిన ఏర్పాట్లు చేసినట్టు తెలిపింది. ఉదయం 6 గంటల నుంచి భక్తులను ఆలయంలోకి అనుమతించనున్నారు.

ప్రస్తుతం అన్ని రోజులలో రాత్రి 9 గంటల ప్రజల దర్శనం కోసం అవకాశం కల్పించనున్నట్టు ఆలయ అధికారులు వెల్లడించారు. కాగా, భక్తులు ఆలయంలోకి ప్రవేశించడానికి వారి RT-PCR రిపోర్టుని తప్పకుండా వెంట తెచ్చుకోవాని అది కూడా జారీ చేసిన తేదీ నుండి 96 గంటల వరకు చెల్లుబాటు అయ్యేలా ఉండాలని కండిషన్స్​ పెట్టారు. అంతేకాకుండా  రెండు డోసుల టీకాలు తీసుకున్నట్టు సర్టిఫికెట్​ కూడా వెంట తీసుకెళ్లడం మరిచిపోవద్దంటున్నారు. ఈ పరిమితి ఫిబ్రవరి 17 వరకు  అమల్లో ఉంటుందని, అలాగే.. శానిటైజేషన్ కోసం ఆదివారాలు భక్తులకు దర్శనం చేసుకునే అవకాశం ఉండదని తెలిపారు

Advertisement

తాజా వార్తలు

Advertisement