Monday, May 6, 2024

భార్య‌తో ఉత్త‌ర కొరియా అధ్య‌క్షుడు కిమ్ ఫోజులు

ఉత్త‌ర కొరియా అధ్య‌క్షుడు కిమ్ భార్య రి సోల్ జు ఐదు నెల‌ల త‌ర్వాత మీడియాకి చిక్కారు. లునార్ న్యూ ఇయ‌ర్ సెల‌వు దినం సంద‌ర్భంగా రాజ‌ధాని ప్యాంగ్యాంగ్ లోని మ‌న్సుడే ఆర్ట్ థియేటర్‌లో జరిగిన ఆర్ట్ ప్రదర్శనకు కిమ్ , అత‌ని భార్య హాజరైనట్లు అధికారిక KCNA వార్తా సంస్థ వెల్ల‌డించింది. ఈ జంట‌ని చూసిన వారు వారితో సెల్ఫీలు దిగేందుకు యత్నించారు. ఒకప్పుడు కిమ్‌తో పాటు సాంఘిక, వ్యాపారం, సైనిక విహారయాత్రలకు కూడా రి సోల్ జు వెళ్లడం వల్ల అంతర్జాతీయ దృష్టిని ఆకర్షించింది.
ఆమె గత ఫిబ్రవరిలో ఒక సంగీత కచేరీకి హాజరు కావడానికి ముందు ఒక సంవత్సరానికి పైగా రాష్ట్ర మీడియాకి దూరంగా ఉంది. దాంతో ఆమె గ‌ర్భ‌వ‌తి అనే అనుమానాలు వ్య‌క్తమ‌య్యాయి. కానీ అది అవాస్త‌మ‌ని తేలింది. కిమ్, రిల‌కి ముగ్గురు పిల్ల‌లు ఉన్నార‌ని విశ్వ‌స‌నీయ స‌మాచారం. ఎందుకంటే కిమ్ త‌న వ్య‌క్తిగ‌త విష‌యాల‌ను బ‌య‌టికి రానివ్వ‌రు కాబ‌ట్టి ఎవ‌రికీ పెద్ద‌గా అత‌ని ప‌ర్స‌న‌ల్ విష‌యాలు తెలియ‌దు. అయితే ఉత్త‌ర‌కొరియాలో కొవిడ్ కేసులు ఉన్న‌ట్లు చెప్ప‌లేదు..కానీ స‌రిహ‌ద్దుల‌ను మూసివేసిన సంగ‌తి తెలిసిందే.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement