Saturday, May 4, 2024

వీల్ చైర్ లో పార్ల‌మెంట్ స‌మావేశాల‌కి హాజ‌రైన ఎంపీ.. ఫొటో పోస్ట్ చేసిన శ‌శిథ‌రూర్

పార్ల‌మెంటు శీతాకాల స‌మావేశాలు కొన‌సాగుతున్నాయి. కాగా త‌న పీఎల స‌హాయంతో లోక్ స‌భ‌లో ప్ర‌త్యేక‌ద్వారం నుండి లోప‌లికి ప్ర‌వేశించారు కాంగ్రెస్ ఎంపీ శ‌శిథ‌రూర్. ఇటీవల పార్లమెంటు భవనంలో మెట్లు దిగుతూ జారిపడ్డారు శ‌శిథ‌రూర్. దాంతో ఆయన కాలు బెణికింది. వైద్యుల సలహాపై కొన్నిరోజులు ఇంటికే పరిమితం అయ్యారు. పార్లమెంట్ లోకి వీల్ చెయిర్ తో రావాలంటే ఒకే ఒక్క మార్గం ఉందని, అది డోర్ నెం.9 అని తెలిపారు.

మొత్తమ్మీద నా సిబ్బంది సాయంతో ఓ నాలుగు నిమిషాల పాటు లోక్ సభలో నా పర్యటన చక్కగా సాగింది. ఈ తాత్కాలిక వైకల్యం ద్వారా నాకో విషయం బోధపడింది… వైకల్యాలతో బాధపడేవారి కోసం మన వద్ద పేలవరీతిలో సదుపాయాలు ఉన్నాయన్న విషయం అర్థమైందని వివరించారు. ఈ మేరకు తాను వీల్ చెయిర్ లో ఉన్నప్పటి ఫొటోను కూడా శశి థరూర్ పంచుకున్నారు. దీనిపై థరూర్ ట్విట్టర్ లో వెల్లడించారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement