Thursday, April 25, 2024

HYD: ప్రైవేట్ స్కూల్ ప్రిన్సిపాల్ దౌర్జన్యం.. పేరెంట్స్ కు తీవ్రగాయాలు

హైదరాబాద్ లోని పాతబస్తీ తీగలకుంటలో దారుణం జరిగింది. ఓ ప్రైవేట్ స్కూల్ ప్రిన్సిపాల్ దౌర్జన్యం చేశారు. కొంత మంది విద్యార్థులు స్కూల్ కు లేట్ గా వచ్చారు. అయితే విద్యార్థుల తల్లిదండ్రులను స్కూల్ ప్రిన్సిపాల్ స్కూల్ కు పిలిచి చితకబాదారు. ప్రిన్సిపాల్ దాడితో విద్యార్థుల తల్లిదండ్రులు తీవ్రంగా గాయపడ్డారు. తల్లిదండ్రుల అభ్యర్థనతో ప్రిన్సిపాల్ ఒక విద్యార్థిని లోపలికి పిలిపించుకున్నారు. ఒక విద్యార్థిని ఎలా లోపలికి అనుమతిస్తారని ప్రిన్సిపాల్ తో పేరెంట్స్ వాగ్వాదానికి దిగారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో మైలార్ దేవ్ పల్లి పోలీసులు రంగప్రవేశం చేశారు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement