Monday, May 13, 2024

Sansad TV: కాంగ్రెస్ ఎంపీ రాజీనామా.. ఆ బాధ్యతల నుంచి తప్పుకున్న శశిథరూర్

రాజ్యసభలో 12 మంది ఎంపీలను సస్పెన్షన్ వ్యవహారంపై ఇంకా వివాదం కొనసాగుతోంది. దీనిపై ప్రతిపక్ష పార్టీలు తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నాయి. ఈ క్రమంలో రాజ్యస‌భ టీవీకి రాజీనామా వస్తున్నాయి. ఇప్ప‌టికే సంస‌ద్ టీవీ యాంక‌ర్ బాధ్య‌తల నుంచి శివసేన ఎంపీ ప్రియాంక చ‌తుర్వేది త‌ప్పుకున్నారు. తాజాగా కాంగ్రెస్ ఎంపీ శశి థ‌రూర్ రాజీనామా చేశారు. ఇప్ప‌టి వ‌ర‌కు సంస‌ద్ టీవీలో టు ది పాయింట్ అనే ప్రోగ్రామ్ కు ఎంపీ శశి థ‌రూర్ యాంక‌ర్ గా బాధ్య‌త‌లు నిర్వ‌ర్తించారు. ఇక, యాంక‌ర్ బాధ్య‌తల నుంచి పూర్తిగా త‌ప్పుకుంటున్న‌ట్టు ఎంపీ శ‌శి థ‌రూర్ ప్ర‌క‌టించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement