Monday, May 6, 2024

Story : 18నెల‌ల్లో గుండెపోటుతో క‌న్నుమూసిన.. ఏడుగురు సెల‌బ్రిటీలు

గ‌డిచిన 18నెల‌ల్లో ఏడుగురు సెల‌బ్రిటీలు హార్ట్ ఎటాక్ తో క‌న్నుమూయ‌డం బాధాక‌రం. కన్నడ సూపర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ నుంచి నందమూరి తారకరత్న వ‌ర‌కు .. ఇలా వీరంద‌రూ గుండెపోటుతోనే క‌న్నుమూశారు. కన్నడ నటుడు పునీత్ రాజ్ కుమార్ జిమ్ లో కసరత్తు పూర్తిచేసిన తర్వాత ఉన్నట్టుండి హార్ట్ ఎటాక్ తో కుప్పకూలారు. ఆసుపత్రికి తరలించేలోపే తుదిశ్వాస వదిలారు. 46 ఏళ్ల వయసులోనే కన్నుమూశారు. ఆంధ్రప్రదేశ్ ఐటీ శాఖ మంత్రిగా పనిచేసిన మేకపాటి గౌతమ్ రెడ్డి 49 ఏళ్ల వయసులోనే హఠాన్మరణం పాలయ్యారు. నిత్యం జిమ్ లో వర్కౌట్స్ చేసే గౌతమ్ రెడ్డి కూడా గుండెపోటుతో చనిపోయారు. ఆరోగ్యం విషయంలో అత్యంత శ్రద్ధ చూపే గౌతమ్ రెడ్డి ఇలా గుండెపోటుతో మరణించడం ఆయన కుటుంబ సభ్యులతో పాటు బంధువులు, అనుచరులను షాక్ కు గురిచేసింది.

ఇక ప్రముఖ గాయకుడు కెకె 53 ఏళ్ల వయసులో హార్ట్ ఎటాక్ తో చనిపోయారు. కోల్ కతాలోని ఓ కాలేజీ ఫెస్ట్ లో ప్రదర్శన ఇస్తుండగా ఉన్నట్టుండి కెకె కుప్పకూలారు. నిర్వాహకులు ఆసుపత్రికి తరలించేలోపే ఆయన తుదిశ్వాస వదిలారు. బాలికా వధు, బిగ్ బాస్ ద్వారా ప్రేక్షకుల మన్ననలు చూరగొన్న నటుడు సిద్ధార్థ్ శుక్లా 40 ఏళ్లకే హార్ట్ ఎటాక్ తో తుదిశ్వాస వదిలారు. రాత్రి 10 గంటల వరకు దాదాపు 3 గంటలు జిమ్ చేసి, డిన్నర్ చేసి పడుకున్న శుక్లా నిద్రలోనే చనిపోయారు. ప్రముఖ టీవీ నటుడు సిద్ధాంత్‌ వీర్‌ సూర్యవంశీ 46 ఏళ్ల వయసులో కన్నుమూశారు. జిమ్ లో వ్యాయామం చేస్తూ చేస్తూనే కుప్పకూలారు. వెంటనే దగ్గర్లోని ఆసుపత్రికి తరలించినా ఉపయోగంలేకుండా పోయింది. అప్పటికే ఆయన చనిపోయినట్లు వైద్యులు ప్రకటించారు.

- Advertisement -

కాగా స్టాండప్‌ కమెడియన్‌ రాజు శ్రీవాత్సవ కూడా చిన్న వయసులోనే మరణించారు. జిమ్ లో వర్కౌట్లు చేస్తుండగా శ్రీవాత్సవ గుండెపోటుకు గురయ్యారు. దీంతో ఆయనను వెంటనే ఢిల్లీలోని ఎయిమ్స్ కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ 41 రోజుల తర్వాత శ్రీవాత్సవ తుదిశ్వాస వదిలారు.ఇక న‌టుడు నందమూరి తారకరత్న కూడా 40 ఏళ్ల వయసులోనే హార్ట్‌ ఎటాక్‌తో చనిపోయారు. తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ జనవరి 27న కుప్పంలో పాదయాత్ర ప్రారంభించగా.. మొదటి రోజు తారకరత్న కూడా పాల్గొన్నారు. లోకేశ్ తో కలిసి నడిచారు. ఈ క్రమంలోనే ఒక్కసారిగా గుండెపోటుతో కుప్పకూలారు. వెంటనే ఆయనను కుప్పం ఆసుపత్రికి, అక్కడి నుంచి బెంగళూరులోని నారాయణ హృదయాలయ ఆసుపత్రికి తరలించారు. చికిత్స అందించేందుకు విదేశాల నుంచి నిపుణులను పిలిపించారు. ఆసుపత్రిలో 23 రోజుల చికిత్స తర్వాత శనివారం తారకరత్న కన్నుమూశారు.దాంతో వారి కుటుంబీకుల‌తో పాటు అభిమానుల‌ని శోక‌స‌ముద్రంలో ముంచుతున్నాయి ఈ హ‌ఠాత్త్ మ‌ర‌ణాలు.

Advertisement

తాజా వార్తలు

Advertisement