Monday, May 6, 2024

భారీ లాభాల‌తో ముగిసిన స్టాక్ మార్కెట్లు

నేటి స్టాక్ మార్కెట్లు భారీ లాభాల‌తో ముగిశాయి. నేడు ట్రేడింగ్ ప్రారంభమైనప్పటి నుంచి మార్కెట్లు పైకి ఎగబాకుతూనే వచ్చాయి. ఈ క్రమంలో ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 708 పాయింట్లు పెరిగి 59,276కి చేరుకుంది. నిఫ్టీ 223 పాయింట్లు లాభపడి 17,670కి పెరిగింది. ఈరోజు అన్ని సూచీలు లాభపడ్డాయి. యుటిలిటీస్, పవర్, పీఎస్యూ సూచీలు 3 శాతానికి పైగా పెరిగాయి. ఎన్టీపీసీ (5.97%), పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (3.90%), ఇండస్ ఇండ్ బ్యాంక్ (3.20%), స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (3.10%), హెచ్డీఎఫ్సీ లిమిటెడ్ (2.95%) బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్ గా నిలిచాయి.. టెక్ మహీంద్రా (-0.74%), డాక్టర్ రెడ్డీస్ లేబొరేటరీస్ (-0.59%), టైటాన్ (-0.44%), సన్ ఫార్మా (-0.36%), ఇన్ఫోసిస్ (-0.18%) టాప్ లూజర్స్ గా మిగిలాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement