Saturday, May 18, 2024

భ‌ర్త‌కి ముందే పెళ్ళ‌యింద‌ని కోర్టుకెక్కిన రెండో భార్య – దాడికి తెగ‌బ‌డ్డ భ‌ర్త‌

భ‌ర్త చేసిన మోసం తెలుసుని విడాకుల కోసం కోర్టులో పిటిష‌న్ వేసింది అపూర్వ పురాణిక్. దాంతో క‌క్ష పెంచుకున్న భ‌ర్త అపూర్వ కదలికలపై నిఘా పెట్టి మరీ ఆమెపై దాడి చేసేందుకు సిద్ధ‌మ‌య్యాడు. అందులో భాగంగానే ఆమె స్కూటీ నేర్చుకుంటుండగా కొడవలితో కిరాతకంగా ఆమె మీద దాడి చేశాడు. ఇది గమనించిన స్థానికులు రావడంతో అక్కడి నుంచి పారిపోయాడు. స్థానికులు ఆమెను ఆస్పత్రికి తరలించారు. పోలీసులు.. ఆమె తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని అతడిని అరెస్టు చేశారు. ఆమె ఆసుపత్రిలో చికిత్స పొందుతోందని పైగా ఆమె శరీరంపై దాదాపు 22 గాయాలు ఉన్నాయని పోలీసులు తెలిపారు. అంతేకాదు ఈ ఘటనకు సంబంధించిన వీడియోల్లో.. ప్రాణాలతో బయటపడిన వ్యక్తి చెబుతున్నట్టుగా ‘మీ ధర్మానికి విరుద్ధంగా వివాహం చేసుకోకండి’ అని ఉన్న ఒక వీడియో వైరల్ అవుతుంది. వివ‌రాల్లోకి వెళ్తే కులం ఏదైనా ప్రేమించిన వాడికోసం మ‌తం మారి మ‌రీ పెళ్లి చేసుకుంది అపూర్వ‌. వీరికి ఓ పాప కూడా ఉంది. అయితే అప్పుడే తెలిసింది అస‌లు నిజం. ముందే త‌న భ‌ర్త‌కి పెళ్ల‌యింద‌ని..ముగ్గురు పిల్లలు ఉన్నార‌ని దాంతో విడాకుల కోసం అప్లై చేస్తే ..దాడికి తెగ‌బ‌డ్డాడు ఆ భ‌ర్త‌.

Advertisement

తాజా వార్తలు

Advertisement