Tuesday, May 7, 2024

Kurnool: బస్సులో రూ.1.25 కోట్లు.. సీజ్ చేసిన ఎస్‌ఈబీ అధికారులు

కర్నూలు జిల్లాలోని పంచలింగాల చెక్‌పోస్టు వద్ద ఎస్‌ఈబీ అధికారులు గురువారం తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో భారీగా నగదు పట్టుబడింది. హైదరాబాద్ నుండి రాజాంపేటకు వెళ్తున్న ప్రైవేట్ బస్సులో ఓ వ్యక్తి వద్ద నుంచి రూ.1.25 కోటి నగదును స్వాధీనం చేసుకున్నారు. ఈ నగదు సంబంధించిన ఎటువంటి ఆధారాలు లేకుండా తరలిస్తున్నట్లు సెబ్ అధికారులు గుర్తించారు. పత్రాలు లేకుండా నగదు తరలిస్తున్న ఉదయ్ కుమార్ అనే వ్యక్తి పోలీసులు విచారిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement