Friday, April 26, 2024

కీవ్ లో – ర‌ష్యాకి చెందిన‌ మ‌హిళా జ‌ర్న‌లిస్ట్ మృతి

ర‌ష్యా ఇంకా ఉక్రెయిన్ పై యుద్ధాని కొన‌సాగిస్తూనే ఉంది. కాగా కీవ్ లో ర‌ష్యా బ‌ల‌గాలు గుండ్ల వ‌ర్షాన్ని కురిపించారు. దాంతో ర‌ష్యాకు చెందిన మ‌హిళా జ‌ర్న‌లిస్టు మ‌ర‌ణించింది. పరిశోధనాత్మక వార్తా సంస్థ ది ఇన్‌సైడర్‌కు చెందిన జర్నలిస్టు ఓక్సానా బౌలినా మరణించిందని ఆ సంస్థ ప్రకటించింది. కీవ్‌లో రష్యా దళాలు సృష్టించిన విధ్వంసాన్ని చిత్రీకరిస్తుండగా ప్రమాదవశాత్తు మృతిచెందిందని తన వెబ్‌సైట్‌లో పేర్కొంది. ఈ దాడిలో మరో పౌరుడు కూడా మరణించాడని, ఇద్దరు వ్యక్తులు గాయపడ్డారు.
బౌలినా గతంలో రష్యా ప్రతిపక్ష నాయకుడు అలెక్సీ నవల్నీ అవినీతి నిరోధక బృందంలో పనిచేశారు. కాగా, ఉక్రెయిన్‌పై రష్యా దాడి నేపథ్యంలో బౌలినా క్షేత్రస్థాయిలో ఇన్‌సైడర్‌ కోసం పనిచేస్తున్నారు. విధుల్లో భాగంగా పశ్చిమ ఉక్రెయిన్‌లోని కీవ్, ఎల్వివ్‌ నుంచి అనేక వార్తా కథనాలను ఆమె అందించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement