Wednesday, May 22, 2024

రోడ్డు ప్రమాదంలో ఆర్మీ ఉద్యోగి మృతి

శ్రీకాకుళం జిల్లా సోంపేట మండలం కొర్లాము జాతీయ రహదారి పై అర్థరాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో అండమాన్ లో టెరిటోరియల్ ఆర్మీలో ఉద్యోగం చేస్తున్న డి. యోగేశ్వరరావు (38) సెలవుపై ఇంటికి వచ్చి కొర్లాము గ్రామం సమీపంలో జాతీయ రహదారిపై గుర్తుతెలియని వాహనం ఢీకొట్టడంతో మృతి చెందాడు. మృతునికి భార్యతో పాటు ఇద్దరు పిల్లలు ఉన్నారు. స్థానికుల సమాచారం మేరకు బారువ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కొరకు సోంపేట పట్నం లో గల ప్రభుత్వ సామాజిక ఆసుపత్రి కి తరలించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement